మా అధ్యక్ష పదవికి పోటీపడిన తనను భయపెట్టారని, కుళ్లు రాజకీయాలు, కుట్రలు చేశారని కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన రాజేంద్రప్రసాద్ అన్నారు. ఎన్నికను అధికారికంగా ప్రకటించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మురళీమోహన్ వర్గంపై పరోక్షంగా నిప్పులు చెరిగారు. తనను అభిమన్యుడిలా అంతం చేద్దామనుకున్నారని, కానీ తాను నటకిరీటిని కాబట్టి అర్జునుడిలా విజయం సాధించానని ఆయన అన్నారు. అలాగే తాము పంచపాండవుల్లా ఐదుగురిమే బరిలోకి దిగామని, వాళ్లు మాత్రం కౌరవుల్లా వచ్చారని ఎద్దేవా చేశారు.
Apr 17 2015 1:46 PM | Updated on Mar 22 2024 11:05 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement