మోడీ సర్కారు తొలి రైల్వే బడ్జెట్ నేడు సభ ముందుకు రానుంది. రైల్వే మంత్రి సదానంద గౌడ 2014-15 సంవత్సరానికి రైల్వే శాఖ బడ్జెట్ను మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు, ప్రమాద రహిత ప్రయాణాలే తన ప్రాథమ్యాలని రైల్వే మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సమయంలోనే గౌడ స్పష్టం చేసిన నేపథ్యంలో ఆ దిశగా ఈ బడ్జెట్లో పలు ప్రతిపాదనలు ఉండొచ్చని భావిస్తున్నారు.