కృష్ణా ట్రిబ్యునల్ కేసు ఐదు వారాల వాయిదా | krishna-water-disputes-tribunal-case-adjourned | Sakshi
Sakshi News home page

Jan 30 2015 12:34 PM | Updated on Mar 22 2024 11:30 AM

కృష్ణా ట్రిబ్యునల్ కేసును సుప్రీంకోర్టు అయిదు వారాల పాటు వాయిదా వేసింది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును గెజిట్ లో నోటి ఫై చేయవద్దని ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక రాష్ట్రం న్యాయస్థానంలో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీనిపై మూడు వారాల్లోగా అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు సుప్రీంకోర్టు సూచించింది. కాగా కృష్ణా ట్రిబ్యునల్ పిటిషన్లు అన్ని ఒకేచోట విచారించాలని తెలంగాణ ప్రభుత్వం ఈ సందర్భంగా న్యాయస్థానాన్ని కోరింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement