ఆక్రమణల కూల్చివేత మంచిదే | Sakshi
Sakshi News home page

ఆక్రమణల కూల్చివేత మంచిదే

Published Sat, Oct 1 2016 6:56 AM

రాష్ట్రంలో నాలాలు, చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేసేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు అభినందనీయమేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే ఈ కూల్చివేతల విషయంలో చట్ట ప్రకారం వ్యవహరించాలని స్పష్టం చేసింది. ఆక్రమించినవారిగా పేర్కొంటున్నవారికి నోటీసులు ఇవ్వకుండా, వాదనలను వినిపించే అవకాశమివ్వకుండానే కూల్చివేతలకు ఉత్తర్వులు జారీ చేయరాదని మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికారులను ఆదేశించింది. రెండు వారాల గడువు ఇచ్చి వారి వాదన వినాలని.. తర్వాతే కూల్చివేతలపై నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. చట్టాల అమలు విషయంలో సమతుల్యత పాటించాల్సిన బాధ్యత అటు ప్రభుత్వంపై, ఇటు న్యాయస్థానంపై ఉందని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement
Advertisement