ప్రత్యేక హోదా విషయంలో భారతీయ జనతా పార్టీని తప్పుపట్టలేమని శాసనమండలి విపక్ష నేత సీ. రామచంద్రయ్య అభిప్రాయపడ్డారు. గురువారం శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ మొదటినుంచీ ప్రత్యేకహోదా ఇవ్వలేమని చెబుతుందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నట్లుగా ప్రత్యేక హోదా అనేది సెంటిమెంట్ కాదని.. అది ప్రజల హక్కు అని స్పష్టం చేశారు. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సుముఖంగా ఉన్నా.. చంద్రబాబు స్వప్రయోజనాల కోసం అందుకు విరుద్ధంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు.