భూమా నాగిరెడ్డికి బెయిల్ మంజూరు | bhuma-nagireddy-and-20-others-sanctioned-bail | Sakshi
Sakshi News home page

Nov 21 2014 7:24 PM | Updated on Mar 21 2024 10:47 AM

మునిసిపల్ సమావేశంలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో అరెస్టు చేసిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. భూమా నాగిరెడ్డితో పాటు మరో 20 మందికి కూడా బెయిల్ మంజూరు చేస్తూ నంద్యాల మూడో అదనపు మేజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నంద్యాల మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో జరిగిన స్వల్ప ఘర్షణ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే భూమాతో పాటు పలువురిపై హత్యాయత్నం కేసులు పెట్టి, రౌడీషీట్ ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత అనారోగ్యానికి గురి కావడంతో నాగిరెడ్డిని హైదరాబాద్ నిమ్స్కు తరలించి అక్కడే చికిత్స అందించారు. పోలీసుల కస్టడీలో ఉండటంతో తన కుమార్తె, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రమాణ స్వీకారానికి కూడా నాగిరెడ్డి హాజరు కాలేకపోయారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement