ఇండోనేషియాను భారీ భూకంపం కుదిపేసింది. ఉత్తర సుమత్రా దీవుల్లోని ఆసె ప్రావిన్స్లో ఆదివారం రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపదాటికి భారీ నిర్మాణాలు సైతం నేలమట్టమయ్యాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 25 మంది మృతిచెందగా, వందకుమందిపైగా గాయాలైనట్టు సమాచారం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.