ఉరి శిక్ష తప్పదు.. 30నే అమలు

ముంబై పేలుళ్ల కారకుడు, ఉగ్రవాది యాకూబ్ మెమన్ను ఈ నెల 30న ఉరి తీయనున్నారు. ఉరిశిక్ష అమలును ఆపాలంటూ మెమెన్ దాఖలు చేసిన పిటిషన్ను బుధవారం సుప్రీం కోర్టు తిరస్కరించింది. దీంతో టాడా కోర్టు అతనికి విధించిన ఉరిశిక్షను జూలై 30న అమలు చేయనున్నారు. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నాగ్పూర్ సెంట్రల్ జైల్లో ఉన్న మెమెన్కు అదే జైల్లో ఈ శిక్ష అమలు కానుంది.

1993 మార్చి, 12 ముంబైలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో సుమారు 257 మంది మరణించారు. 700 మంది తీవ్రంగా గాయపడిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. యాకూబ్ను ముంబై పేలుళ్ల కుట్రదారుడుగా తేల్చిన టాడా కోర్టు 2007 లో యాకూబ్ , మరో పదిమందికి ఉరిశిక్ష విధించింది. అయితే మార్చి 21, 2013న తుది తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు, యకూబ్ మెమన్‌కు ఉరిశిక్ష ఖరారు చేసింది. మిగిలిన పది మందికి ఉరిశిక్ష నుంచి యావజ్జీవ శిక్షకు తగ్గించింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top