సాక్షి, వైఎస్సార్ జిల్లా: బీటెక్ రవిపై వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీటెక్ రవి పులివెందుల ప్రజలకు కన్నం వేశారు. బైరెటీస్ డంపులను అక్రమంగా అమ్ముకున్నారు. రాత్రికి రాత్రే ముగ్గురాయిని తవ్వుకుని దోచుకున్నారు. మూడు టన్నుల బైరెటీస్ దోచుకుంటే కనీసం కేసు పెట్టలేదు. బీటెక్ రవిని చట్టం ముందు నిలబెడతాం. ఉల్లిమెల్ల తోటకు ఎందుకొచ్చాడో బీటెక్ రవి చెప్పాలి. ఎంపీటీసీ పదవి కోసం ఒక ప్రతిపాదనతో బీటెక్ రవి వచ్చాడు. ఎంపీటీసీ ఎన్నికల తర్వాత వైఎస్సార్సీపీలో చేరాలనుకున్నాడు’అని వ్యాఖ్యానించారు.


