
క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదం
నల్లగొండ టూటౌన్: క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని యాదాద్రి జోనల్ సంరక్షణ అధికారి శివాల రాంబాబు అన్నారు. గురువారం నల్లగొండలోని మేకల అభినవ్ అవుట్ డోర్ స్టేడియంలో రీజనల్ ఫారెస్ట్ స్పోర్ట్స్ – 2025 క్రీడాపోటీలను ఆయన క్రీడా జ్యోతి వెలిగించి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి మహమ్మద్ అక్బర్ అలీ, ఏటీఆర్ సర్కిల్ సంరక్షణ అధికారి సునీల్ ఇరామత్, నల్లగొండ డీఎఫ్ఓ పెట్ల రాజశేఖర్, ఎఫ్డీఓ నాగభూషణం, ఎఫ్ఆర్ఓ వీరేంద్రబాబు, భువనగిరి, జోగులాంబ గద్వాల, నల్లగొండ సర్కిల్కు సంబంధించిన తొమ్మిది జిల్లాల ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు.