కూటమి ప్రభుత్వం దివ్యాంగులతో ఆటలాడుతూ నరకం చూపిస్తోంది. అంగవైకల్యం స్పష్టంగా కనిపిస్తున్నా పింఛన్ల కోసం రీ వెరిఫికేషన్ అంటూ వారిని నానా యాతనలు పెడుతోంది. శ్లాట్ బుక్ చేసుకున్న తరువాత ఆసుపత్రికి వస్తే సంబంధిత డాక్టర్ లేరు... అక్కడికి వెళ్లు.. ఇక్కడికి వెళ్లు అంటూ వార్డులు తిప్పుతున్నారని దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంటి బిడ్డలతో, నడవలేని పరిస్ధితుల్లో ఉన్న వృద్ధులు ఎలా తిరుగుతారంటూ ప్రభుత్వం, డాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు రాగా 12 గంటలు దాటినా దివ్యాంగులను పట్టించుకోకపోవడంపై మండిపడుతున్నారు. దివ్యాంగుల రీవెరిఫికేషన్ వార్డు వద్ద బాధితుల దయనీయమైన దృశ్యాలు ఇవి.
– సాక్షి ఫొటోగ్రాఫర్/ ఏలూరు


