వయోవృద్ధులకు వైద్యసేవలందించాలి | - | Sakshi
Sakshi News home page

వయోవృద్ధులకు వైద్యసేవలందించాలి

Aug 3 2025 2:50 AM | Updated on Aug 3 2025 2:50 AM

వయోవృద్ధులకు వైద్యసేవలందించాలి

వయోవృద్ధులకు వైద్యసేవలందించాలి

ఎంజీఎం: ఎంజీఎం ఆస్పత్రిలో వయోవృద్ధులకు మెరుగైన వైద్య సేవలందించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలాగీతాంబ పేర్కొన్నారు. సీని యర్‌ సిటిజన్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ హనుమకొండ ఆధ్వర్యంలో వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టం–2007పై ఎంజీఎంలో శనివారం శిక్షణ తరగతులు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆమె హాజరై మా ట్లాడుతూ వయోవృద్ధులకు ప్రత్యేక వార్డులు, ఇతర సౌకర్యాలను కల్పించి వైద్య సేవలందించాలన్నా రు. ప్రతి కుటుంబంలో కొడుకులు, కోడళ్లు, కుమార్తెలు పెద్దవారిపై ప్రేమ, గౌరవ మర్యాదలతో మెలగాలని, వీరిని చూసి ఇంట్లో పిల్లలు కూడా పెద్దవారితో ప్రేమగా మెలుగుతారని తెలిపారు. ఎంజీ ఎం సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కిశోర్‌ మాట్లాడుతూ వయోవృద్ధులకు ప్రత్యేక వైద్యసేవలందిస్తున్నామని, వారికి ప్రత్యేక ఓపీ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శిక్షణలో హెల్పేజ్‌ ఇండియా సంస్థ రాష్ట్ర కోఆర్డినేటర్‌ శ్యాంకుమార్‌ పాల్గొన్నారు.

జిల్లా ప్రధాన న్యాయమూర్తి

నిర్మలాగీతాంబ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement