అస్తవ్యస్తంగా వార్డుల విభజన | - | Sakshi
Sakshi News home page

అస్తవ్యస్తంగా వార్డుల విభజన

Jun 13 2025 4:37 AM | Updated on Jun 13 2025 4:37 AM

అస్తవ్యస్తంగా వార్డుల విభజన

అస్తవ్యస్తంగా వార్డుల విభజన

నర్సంపేట: నర్సంపేట సెకండ్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీలో వార్డుల విభజన ప్రక్రియ అస్తవ్యస్తంగా మారింది. ఇటీవల 8 గ్రామపంచాయతీలు మున్సిపాలిటీలో విలీనమయ్యాయి. కాగా, రాజకీయ పార్టీలతో పాటు విలీన గ్రామాల ప్రజలు ఓట్లు రెండు, మూడు వార్డుల్లో ఉండడాన్ని అంగీకరించడం లేదు. గతంలో 24 వార్డులు ఉండగా వారం రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌తో మున్సిపాలిటీలో మహేశ్వరం, మగ్ధుంపురం, రాజపల్లి, రాములునాయక్‌తండా, పర్శనాయక్‌తండా, నాగుర్లపల్లి, మాదన్నపేట, ముత్తోజిపేట విలీనమయ్యాయి. దీంతో ఓటర్ల సంఖ్య 40,561, వార్డుల సంఖ్య 30కి చేరింది. దీని ద్వారా మున్సిపాలిటీ అధికారులు చేసిన వార్డుల విభజనపై విమర్శలు వస్తున్నాయి.

రెండుమూడు వార్డుల్లో ఒక గ్రామ ఓటర్లు

ఒక్కో గ్రామానికి చెందిన ఓటర్లను రెండు మూడు వార్డుల్లో కేటాయించడంతో గందరగోళం నెలకొంది. మున్సిపాలిటీలో విలీనమైన మగ్ధుంపురంలో 2,026 మంది ఓటర్లు ఉండగా కొన్ని ఓట్లు పదో వార్డులో కలిపారు. మిగిలిన 1,420 ఓట్లను మగ్ధుంపురం 11వ వార్డుగా అధికారులు ఏర్పాటు చేశారు. మరికొన్ని ఓట్లను రాజపల్లిలో కలిపి 12వ వార్డుగా చేశారు. మహేశ్వరంలోని 2,993 ఓట్లను కొన్ని రాములుతండాలో కలిపి 13వ వార్డుగా ఏర్పాటు చేశారు. 1,451 ఓట్లతో మహేశ్వరం పేరుతో 14వ వార్డు విభజించారు. మరో 589 ఓట్లను పట్టణంలోని 25వ వార్డు పోచమ్మగుడి ఏరియాలో చేర్చారు. మాదన్నపేటలో 2006 ఓట్లు ఉండగా 1,489 ఓట్లతో 1వ వార్డు చేశారు. మిగిలిన ఓట్ల విషయంలో ఎలాంటి స్పష్టత లేకపోవడంతో గందరగోళం నెలకొంది.

అభ్యంతరాల వెల్లువ..

వార్డుల విభజన విషయంలో వినతులను స్వీకరించిన మున్సిపాలిటీకి కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీతో పాటు విలీన గ్రామాల నుంచి కూడా అభ్యంతరాలు వెల్లువెత్తాయి. విలీన గ్రామాల్లోని ఓటర్లకు ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని బుధవారం పలువురు వినతిపత్రాలు అందించారు. కొత్త వార్డులను సవరించాలని పలు పార్టీల నాయకులు సమర్పించిన వినతిపత్రాలను అధికారులు పరిశీలించి చర్యలు తీసుకునేందుకు కార్యాచరణ ప్రారంభించినట్లు మున్సిపాలిటీ టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ వీరస్వామి తెలిపారు.

మున్సిపాలిటీ పరిధిలో ఓటర్ల వివరాలు..

ప్రాంతం పురుషులు మహిళలు మొత్తం

నర్సంపేట టౌన్‌ 13,987 15,324 29,311

ముగ్ధుంపురం 967 1,059 2,026

మహేశ్వరం 1,458 1,535 2,993

రాములునాయక్‌తండా 240 256 496

రాజపల్లి 573 594 1,167

మాదన్నపేట 744 754 1,498

నాగుర్లపల్లి 448 468 916

పర్శనాయక్‌తండా 247 259 506

ముత్తోజిపేట 761 885 1,646

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement