
ఆహ్లాదం.. పోచంపల్లి పాఠశాల
బడి ఆవరణలో 830 మొక్కలతో ప్లాంటేషన్
విద్యారణ్యపురి: దాతలు, ప్రేరణ ఫౌండేషన్ సహకారంతో కాజీపేటలోని పోచంపల్లి ప్రభుత్వ పాఠశాల ఆహ్లాదాన్ని పంచుతోంది. డీఆర్ఓ గణేశ్, ఉద్యానశాఖ అధికారి రమేశ్ దాతల సహకారంతో 830 మొక్కలను సమకూర్చి పాఠశాల ఆవరణలో ప్లాంటేషన్ తయారు చేయించారు. రిటైర్డ్ డీఎఫ్ఓ పురుషోత్తం ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. హనుమకొండలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ ప్రాథమిక పాఠశాలను తీర్చిదిద్దిన హెచ్ఎం ఉప్పలయ్య 2023 డిసెంబర్లో పోచంపల్లి ప్రాథమిక పాఠశాలకు బదిలీ అయ్యారు. అక్కడ మురికివాడలోని పిల్లలను బడికి వచ్చేలా చేశారు. ప్రస్తుతం 180 మంది విద్యార్థులకు ఆరుగురు ఉపాధ్యాయులున్నారు. కలెక్టర్ ప్రావీణ్య గురువారం పాఠశాలను సందర్శించి విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాం పంపిణీ చేసి, గార్డెన్ను ప్రారంభిస్తారు.