సైకోల వీరంగం | - | Sakshi
Sakshi News home page

సైకోల వీరంగం

Jun 9 2025 8:02 AM | Updated on Jun 9 2025 8:02 AM

సైకోల వీరంగం

సైకోల వీరంగం

గీసుకొండ: మండలంలోని పలు గ్రామాల్లో సైకోలు ప్రవేశించి వీరంగం సృష్టిస్తున్నారు. ఆయా గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కొన్ని నెలల క్రితం కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కులో పని కోసం వచ్చిన ఓ వ్యక్తి గీసుకొండ గ్రామంలోని ఓ ఇంటి ఆవరణలోకి వెళ్లి పడుకున్నాడు. గమనించిన ఇంటి కుటుంబ సభ్యులు అతడిని బయటకు పంపించడానికి ప్రయత్నించగా వారిపై దాడి చేయబోయాడు. కొద్ది రోజుల క్రితం రాంపురం గ్రామానికి వెళ్లిన ఓ వ్యక్తి హిందీలో మాట్లాడుతూ పిచ్చిగా ప్రవర్తిస్తూ గ్రామస్తులపై దాడికి యత్నించాడు. స్థానికులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మండల పరిధిలోని టెక్స్‌టైల్‌ పార్కు, గొర్రెకుంట ప్రగతి పారిశ్రామిక ప్రాంతాల్లో పని చేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు మద్యం, గుట్కా, ఇతర మత్తు పదార్ధాలకు బానిసలై సైకోలుగా ప్రవర్తి స్తున్నట్లు తెలుస్తోంది. అలాంటి వారిపై పోలీసులు నిఘా పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

‘కాల్పుల విరమణపై

మోదీ వివరణ ఇవ్వాలి’

నర్సంపేట: భారత్‌, పాక్‌లకు వాణిజ్య ఒప్పందాలను రద్దు చేసుకుంటామని చెప్పి కాల్పుల విరమణకు ఒప్పించినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన ప్రకటనలపై ప్రధాని నరేంద్రమోదీ వివరణ ఇవ్వాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వీరయ్య అన్నారు. ఈ మేరకు పట్టణంలోని గ్రీన్‌ రిసార్ట్‌లో ఆదివారం నిర్వహించిన సీపీఎం జిల్లాస్థాయి శిక్షణ తరగతుల్లో సీహెచ్‌.రంగయ్య మాట్లాడారు. ట్రంప్‌ జోక్యంతో కాల్పుల విరమణ జరగడంపై దేశ ప్రజలు అవమానంగా భావిస్తున్నారన్నారు. ట్రంప్‌ వ్యాఖ్య లను ప్రధాని మోదీ ఖండించకపోవడం సందేహాలకు తావిస్తోందని తెలిపారు. పహల్గాంలో ఉగ్రవాదుల దాడి విషయంలో రాజకీయాలకతీతంగా అన్ని పార్టీలు, ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి ఆపరేషన్‌ సింధూర్‌ విషయంలో మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. పహల్గాంలోపై ప్రధాని పార్లమెంట్‌ సమావేశం నిర్వహించి ఎంపీల అభిప్రాయాలు తెలుసుకోవాలని డిమాండ్‌ చేశా రు. ప్రపంచంలోనే భారత్‌ నాలుగవ అభివృద్ధి చెందిన ఆర్ధిక వ్యవస్థగా ప్రధాని మోదీ నీతి అయోగ్‌ సమావేశంలో చెప్పడాన్ని తప్పు ప ట్టారు. ఆపరేషన్‌ కగార్‌ను కొనసాగించడం దా రుణం అన్నారు. రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్‌ నెరవేర్చాల్సిందేనన్నారు. కార్యక్రమంలో బాబు, బాబు, కుమారస్వామి, సమ్మయ్య, స్వామి, కుమార్‌, శ్రీధర్‌, బషీర్‌, సాంబయ్య, దుర్గయ్య, ప్రశాంత్‌ పాల్గొన్నారు.

భద్రకాళి ఆలయంలో

చండీహోమం

హన్మకొండ కల్చరల్‌: భద్రకాళి దేవాలయంలో ఆదివారం ఉద యం అర్చకులు చండీహోమం నిర్వహించారు. అమెరికా దేశం డల్లాస్‌లో స్థిరపడిన ఎన్‌ఆర్‌ఐ రేవతి గత శనివారం 53 గ్రాములు, 57 గ్రాముల కలిగిన రెండు బంగారు కాసు ల హారాలను కానుకగా శ్రీభద్రకాళి అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా రేవతి దంపతులు ఆదివారం అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించి చండీహోమంలో పాల్గొన్నారు. ఆలయ ఈఓ శేషుభారతి పర్యవేక్షించారు.

11 నుంచి బీపీఈడీ నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధి బీపీఈడీ విద్యార్థులకు నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు ఈనెల 11 నుంచి నిర్వహిస్తున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 11, 13, 16, 18 తేదీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు.

నేటి ప్రజావాణి రద్దు

న్యూశాయంపేట : కలెక్టరేట్‌లో సోమవారం (నేడు) నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని పరిపాలన పరమైన కారణాలతో రద్దు చేస్తున్నట్టు కలెక్టర్‌ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement