● జిల్లా మలేరియా అధికారి డి.సూర్యనారాయణ
కొమరాడ: ఏజెన్సీ గ్రామల్లో ప్రజలు మలేరియాపై అప్రమత్తంగా ఉండాలని పార్వతీపురం మన్యం జిల్లా మలేరియా అధికారి డి.సూర్యనారాయణ అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన కొమరాడ మండలంలోని చినఖేర్జిల పంచాయతీ బంజుకుప్ప గ్రామంలో ‘మా ఊరికి మలేరియా’ అనే కార్యక్రమానికి హాజర య్యారు. ఆనంతరం అక్కడ ఉన్న మలేరియా జర్వపీడితులతో మాట్లాడి చిక్సిత అందించి వారి కుటుంబ సభ్యులకు రక్తపరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామల్లో మురుగునీరు నిల్వలేకుండా చేసుకోవాలని సూచించారు. ఖాళీ కొబ్బరిబొండాలు ఎక్కడపడితే అక్కడ ఉండకూడదన్నారు. గ్రామంలో పారిశుధ్య పనులు నిర్వహించాలని కాచి చల్ల ర్చిన నీటి తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో రమేష్, ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


