29న తోటపల్లిలో స్వామివారి కల్యాణం | - | Sakshi
Sakshi News home page

29న తోటపల్లిలో స్వామివారి కల్యాణం

Jan 25 2026 8:00 AM | Updated on Jan 25 2026 8:00 AM

29న తోటపల్లిలో స్వామివారి కల్యాణం

29న తోటపల్లిలో స్వామివారి కల్యాణం

గరుగుబిల్లి: ఉత్తరాంధ్రలో చినతిరుపతిగా పేరుగాంచిన తోటపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో మాఘశుద్ధ ఏకాదశి సందర్భంగా ఈ నెల 29న సాయంత్రం 5 గంటల నుంచి వేంకటేశ్వరస్వామి, పద్మావతి అమ్మవార్ల కల్యాణ మహోత్సవం, జొన్నాడ భట్టరు హరికష్ణమాచార్యులు, రేజేటి పార్థసారాచార్యులు, వీవీ అప్పలాచార్యులచే పాణిగ్రహణ మహోత్సవం నిర్వహించనున్నారు. ఈ మేరకు కల్యాణానికి సంబంధించిన ఏర్పాట్లు చురుకుగా నిర్వహిస్తున్నారు. కల్యాణ మహోత్సవాల్లో భాగంగా ఈ నెల 27న మంగళవారం సాయంత్రం నుంచి కల్యాణానికి సంబంధించి క్రతువులను నిర్వహించనున్నారు. ఫిబ్ర వరి 1న శనివారం పవిత్ర నాగావళి నదిలో స్వామివారికి శ్రీ చూర్ణోత్సవం శ్రీచక్ర తీర్థస్నానం నిర్వహించనున్నారు. కల్యాణంలో భక్తులు పాల్గొనాలని ఈఓ బి.శ్రీనివాస్‌ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement