సింహాచలం: గిరి ప్రదక్షిణలో భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు డిప్యుటేషన్పై వచ్చిన దేవదాయశాఖ, ఇతర దేవస్థానాల ఉద్యోగులు సమన్వయంతో పనిచేయాలని సింహాచలం దేవస్థానం ఈవో వెంకటరావు ఆదేశించారు. సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సేవా కేంద్రాలు, కంట్రోల్ రూమ్లు, వైద్య శిబిరాల్లో నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని, భక్తుల ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని సూచించారు. ఈ నెల 28 రాత్రి 10 గంటల నుంచి 29 రాత్రి 10 గంటల వరకు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని, పరిష్కరించలేని సమస్యలను వెంటనే జిల్లా కమాండ్ కంట్రోల్ రూమ్కు తెలియజేయాలని ఆదేశించారు.


