
ఇదేనా మనమిచ్చే గౌరవం?
క్రీడలు, సాహిత్యం, రాజకీయాలు, కళలు వంటి రంగాల్లో దేశానికి గర్వకారణంగా నిలిచిన ఎందరో మహానుభావుల విగ్రహాలను విశాఖ సాగరతీరంలో ఏర్పాటు చేశారు. ఇవి నగరానికి ప్రత్యేక ఆకర్షణగా మారాయి. యువతకు నిత్యం ప్రేరణగా నిలుస్తున్నాయి. ఈ నెల 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం బీచ్ రోడ్డును ముస్తాబు చేసే క్రమంలో భాగంగా అధికారులు ఈ విగ్రహాలకు రంగులు వేయిస్తున్నారు. నిచ్చెనలు వేసుకుని విగ్రహాలకు రంగులు వేయాల్సిన కార్మికులు.. వారి విలువ, ప్రాధాన్యం తెలియక ఆ విగ్రహాలపై నిల్చొని పైకప్పును శుభ్రం చేయడం, రంగులు వేయడం నగరవాసుల మనసులను కలచి వేస్తోంది. సంబంధిత అధికారులు స్పందించి, మహనీయులకు సముచిత గౌరవం దక్కేలా చూడాలని.. రంగులు వేసే ప్రక్రియను గౌరవప్రదంగా పూర్తి చేయించాలని కోరుతున్నారు.
– ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం

ఇదేనా మనమిచ్చే గౌరవం?

ఇదేనా మనమిచ్చే గౌరవం?