
సీఎంఆర్ ధాన్యం అందజేయాలి
అదనపు కలెక్టర్ లింగ్యానాయక్
అనంతగిరి: వానాకాలం పంటలకు సంబంధించిన సీఎంఆర్ ధాన్యాన్ని ప్రభుత్వానికి సత్వరమే అందజేయాలని అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ మిల్లర్లను ఆదేశించారు. గురువారం ఆయన తన చాంబర్లో రైస్మిల్లర్స్, పౌరసరఫరాల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ మాట్లాడుతూ.. సీఎంఆర్ డెలివరీ చేయనివారిపై, ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. 2024–25 వానాకాలం సీజన్లో పాలుపంచుకున్న మిల్లర్లు అందరూ వరి ధాన్యానికి బ్యాంక్ గ్యారంటీ తప్పనిసరి అందజేయాలన్నారు. లేదంటే తదుపరి సీజన్లో వారికి వరి ధాన్యం అలాట్మెంట్ ఉండదని చెప్పారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల అధికారి మోహన్ బాబు, డీఎం వెంకటేశ్వర్లు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గుప్తా, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సెక్రెటరీ శ్రీధర్ రెడ్డి, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఏజెంట్ల నియామకానికి చర్యలు
బూత్ స్థాయి ఏజెంట్ల నియామకానికి చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అన్నారు. గురువారం ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుంచి ఫారం 6, 7, 8 పెండింగ్, రాజకీయ పార్టీల సమావేశాలు, బూత్ స్థాయి ఏజెంట్ నియామకం తదితర అంశాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మార్చి 19 లోగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి బూతు స్థాయి ఏజెంట్ల నియామకానికి చర్యలు చేప ట్టాలని అధికారులకు సూచించారు. ఫారం 6, 7, 8 పెండింగ్లో ఉంటే ఈ నెల 21లోపు పూర్తి చేయాలన్నారు. ఈ కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సుధీర్, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ నేహమత్ అలీ తదితరులు పాల్గొన్నారు.