– 8లో
చెరువులోని గుంతపడి చిన్నారి మృతి చెందిన సంఘటన ఏర్పేడు మండలం చిందేపల్లి ఎస్టీ కాలనీలో మంగళవారం జరిగింది.
ఎత్తిపోతలకు బ్రేక్తో
నీటి సమస్య
తిరుపతి రోజురోజుకు విస్తరిస్తోంది. ఈ క్రమంలో తాగునీటి సమస్య పొంచి ఉంది. కల్యాణిడ్యామ్, రామాపురం రిజర్వాయర్ కండలేరు నీటిపైనే పూర్తిగా ఆధారపడి ఉన్నాయి. చంద్రబాబు సర్కార్ ఎత్తిపోతల పథకానికి బ్రేక్ వేయడంతో భవిష్యత్తో తిరుపతి నగరానికి తాగునీటి సమస్యలు తప్పవు. తిరుపతి తాగునీటితోపాటు జిల్లాలో సాగునీటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఎత్తిపోతల కోసం పాదయాత్రతోపాటు పోరాటాలు చేయాల్సి ఉంది.
– భూమన అభినయ్రెడ్డి,
తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త
పథకం దూరం
మన ప్రాంతానికి నదులు లేవు. కాలువలు, చెరువులు ఆధారంగానే రైతులు సే ద్యం చేయాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఎన్నికల సమయంలో అడవిపల్లి రిజర్వాయర్ పనులు అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి చేస్తామని చెప్పారు. అయితే ఇప్పటి వరకు ఆ దిశగా అడుగులు వేయలేదు. శిష్యుడి రేవంత్రెడ్డితో చంద్రబాబు చీకటి ఒప్పందం మేరకు సీమ ప్రజలకు ఎత్తిపోతల పథకాన్ని దూరం చేస్తున్నారు.
–విజయానందరెడ్డి, వైఎస్సార్ సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త
పోరాటాలకు ముందుంటా..
ఎవరైనా తాను పుట్టిన ప్రాంతానికి మంచి చేద్దామని ఆలోచిస్తారు. అయితే చంద్రబాబు మా త్రం అందుకు భిన్నంగా అలోచన చేస్తున్నారు. ఆ యన జిల్లాకు చెందిన వ్యక్తి అయినప్పటికీ ఎత్తిపోతల పథకానికి తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో క లసి ఆపివేశారు. రైతుల పోరాటాలకు నేను ముందుంటాను.
– చెవిరెడ్డి మోహిత్రెడ్డి,
చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త
కర్షక ద్రోహి బాబు
వ్యవసాయం దండగ అని గతంలో మాట్లాడిన చంద్రబాబు రైతులకు ఎప్పుడు సానుకూలంగా లేరు. రూ.2 వేల కోట్లు ఖర్చు చేస్తే ఎత్తిపోతల పథకానికి ఢోకాలేదు. అయితే నిధులు లే వని చెప్పడం విడ్డూరం. రూ.2 లక్షల కోట్లతో అమరావతిని ప్రపంచంలోనే ఉన్నత రాజధాని చేసా మనడం సిగ్గుచేటు.
– నూకతోటి రాజేష్,
పార్టీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త


