‘‘సూళ్లూరుపేటనియోజకవర్గంలో ఇసుక, గ్రావెల్, మట్టి దందాలకు తమకు సంబంధం లేదని వేంకటేశ్వరస్వామివారిపై ప్రమాణం చేసి చెప్పగలరా? నియోజకవర్గంలో కూటమి నేతలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్న తీరుపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతారా? ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడంతో అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గపు చర్య. అక్రమాలను ప్రశ్నించేవారి గొంతు నొక్కేలా అక్రమ అరెస్టులు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే తండ్రికి దేవుడంటే భయం లేదు. భక్తి కూడా లేదు. ఆయన ఏకంగా వేంకటేశ్వరస్వామిపై ప్రమాణం చేసి ఇసుక, గ్రావెల్, మట్టి తరలింపులకు తమకు సంబంధం లేదని చెప్పడంతోనే అర్ధమవుతుంది.– కిలివేటి సంజీవయ్య, మాజీ ఎమ్మెల్యే


