చిత్తూరు కమిషనర్‌కు ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

చిత్తూరు కమిషనర్‌కు ప్రమాదం

May 19 2025 7:31 AM | Updated on May 19 2025 7:31 AM

చిత్త

చిత్తూరు కమిషనర్‌కు ప్రమాదం

● టైర్‌ పంక్చర్‌ కావడంతో పల్టీలు కొట్టిన కారు ● తీవ్రంగా గాయపడ్డ కమిషనర్‌ నరసింహ ప్రసాద్‌, సీసీ అమర్నాథ్‌రెడ్డి

పాకాల:ప్రయాణిస్తున్న కారు వెనుకటైరు పంక్చర్‌ కావడంతో చిత్తూరు నగర పాలక సంస్థ కమిషనర్‌ నరసింహప్రసాద్‌ కారు పల్టీలు కొట్టింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల మేరకు శనివారం సాయంత్రం చిత్తూరు నుంచి తిరుపతి వైపు వెళుతుండగా పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపై మండల పరిధిలోని గాదంకి సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో కమిషనర్‌తో పాటు సీసీ అమర్నాథ్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. కారు డ్రైవర్‌ సురక్షితంగా బయట పడ్డాడు. వేగంగా వెళుతున్న కారు టైరు ఒక్కసారిగా పంక్చర్‌ కావడంతో కారు పల్టీలు కొట్టి మెయిన్‌ రోడ్డు నుంచి సర్వీసు రోడ్డుకు కారు చేరుకుంది. అదే మార్గంలో పూతలపట్టు ఎమ్మెల్యే మురళి కారులో ప్రయాణిస్తున్న ఆయన పీఏ భాను ప్రమాదాన్ని గమనించి చికిత్స నిమిత్తం ఇద్దరిని తిరుపతి స్విమ్స్‌ ఆస్పత్రికి తరలించారు.

చిత్తూరు కమిషనర్‌కు ప్రమాదం1
1/2

చిత్తూరు కమిషనర్‌కు ప్రమాదం

చిత్తూరు కమిషనర్‌కు ప్రమాదం2
2/2

చిత్తూరు కమిషనర్‌కు ప్రమాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement