నార్సింగి కేసులో వీడిన మిస్టరీ.. ఇద్దరు అరెస్ట్‌

Two Arrested In Case Of Woman Harassment Of Narsinghi - Sakshi

సాక్షి, రంగారెడ్డి: నార్సింగిలో వివాహిత కిడ్నాప్‌, సామూహిక లైంగిక దాడి కేసులో పోలీసులు ఇద్దరికి అరెస్ట్‌ చేశారు. బాచుపల్లికి చెందిన శుభంశర్మ, సుమిత్‌ శర్మను పోలీసులు అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు. 

కాగా, గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్ట్‌ చేయడం విశేషం. అయితే, ఓ మహిళను కిడ్నాప్‌ చేసి కారు డ్రైవర్లు.. ఆమెతో బలవంతంగా మద్యం తాగించారు. ఈ క్రమంలో స్పృహ కోల్పోయిన అనంతరం.. నిందితులు కారులోనే ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. తర్వాత ఆమెను గండిపేట వద్ద విచిడిపెట్టి కారులో పరారయ్యారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకున్నారు. వారిపై 365, 376 (2)(g) 392, 342 సెక్షన్ ల కింద కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top