సాగర్‌ హైవేపై ఘోర ప్రమాదం | 3 Died And Four Injured In Tragic Road Incident At Yacharam, More Details Inside | Sakshi
Sakshi News home page

సాగర్‌ హైవేపై ఘోర ప్రమాదం

Jun 12 2025 8:58 AM | Updated on Jun 12 2025 9:36 AM

Tragic Road Incident in Yacharam

కారును ఢీకొన్న ట్రావెల్స్‌ బస్సు 

అక్కడికక్కడే ముగ్గురు యువకుల మృతి 

మరో నలుగురికి తీవ్ర గాయాలు 

బర్త్‌ డే వేడుకలు చేసుకుని తిరిగి వస్తుండగా ప్రమాదం 

 మృతులు, క్షతగాత్రులంతా సమీప బంధువులే

యాచారం(హైదరాబాద్): నాగార్జునసాగర్‌– హైదరాబాద్‌ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంటకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వెళ్తున్న ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఎదురుగా వస్తున్న కియా కారును ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. యాచారం సీఐ నందీశ్వర్‌రెడ్డి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

 మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకుల మండలం, గుడిబండ గ్రామానికి చెందిన వాస సాయితేజ(24), వాస రాఘవేంద్ర(22), వాస పవన్‌కుమార్‌(26), వాస శివకుమార్, వాస సాయికుమార్‌(ఇద్దరు అన్నదమ్ములు), ఇదే జిల్లా మూసాపేట మండల కేంద్రానికి చెందిన మేకల సందీప్‌ సమీప బంధువులు. వీరంతా హైదరాబాద్‌ లోని వివిధ ప్రాంతాల్లో ఉంటూ ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మంగళవారం వాస శివకుమార్‌ పుట్టిన రోజు కావడంతో బీఎన్‌రెడ్డి నగర్‌కు చెందిన స్నేహితుడు శివకుమార్‌ గౌడ్‌తో కలిసి..ఉదయం నల్గొండ జిల్లా దేవరకొండ సమీపంలోని వైజాగ్‌ కాలనీకి వెళ్లారు. అక్కడ సంబ రాలు ముగించుకుని మంగళవారం రాత్రి 11.30 గంటల సమయంలో తిరిగి హైదరాబాద్‌ బయల్దేరారు. 

మాల్‌ సమీపంలోకి రాగానే నగరం నుంచి దేవరకొండ వైపు వెళ్తున్న ట్రావెల్స్‌ బస్సు వీరి కారును ఢీకొట్టింది. ఈ సంఘటనలో సాయితేజ, రాఘవేంద్ర, పవన్‌కుమార్‌ అక్కడికక్కడే మృతి చెందారు. శివకుమార్, సాయికుమార్, శివకుమార్‌ గౌడ్, సందీప్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను మాల్, మన్నె గూడలోని ప్రైవేట్‌ ఆస్పత్రులకు తరలించారు.  పారీ్టకి వెళ్లిన వారిలో పవన్‌కుమార్‌ ఒక్కడికే వివాహం జరిగింది. ఇతనికి భార్య వరలక్ష్మి, ఒక కూతురు ఉన్నారు. ప్రస్తుతం వరలక్ష్మి నాలుగు నెలల గర్భిణి. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ నందీశ్వర్‌రెడ్డి తెలిపారు.   

సాగర్‌ రోడ్డుపై ట్రాఫిక్‌ జామ్‌ 
సాగర్‌ రోడ్డుపై జరిగిన ప్రమాదంతో గంటపాటు ట్రాఫిక్‌ జామ్‌ అయింది. సమాచారం అందుకున్న యాచారం పోలీసులు అక్కడికి చేరుకుని కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను అతికష్టం మీద బయటకు తీశారు. ట్రావెల్స్‌ బస్సు, కారును ఢీకొన్న సమయంలో భారీ శబ్దం వచి్చందని గ్రామస్తులు తెలిపారు. అతివేగం కారణంగానే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement