హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సర్వీస్లకు చెందిన ముగ్గురు పోలీస్ అధికారులకు ఐపీఎస్ కన్ఫర్డ్ ఐపీఎస్ పదోన్నతి దక్కింది ఈ మేరకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం పంపింది. ముగ్గురు పోలీసు అధికారులకు కన్ఫర్డ్ ఐపీఎస్లుగా ప్రమోట్ అయిన విషయాన్ని తెలియజేసింది.
వీరిలో ఎస్. శ్రీనివాస్, కే. గుణశేఖర్, డీ. సునీతలు ఉన్నారు. గతంలో సీఎం సెక్యూరిటీ వింగ్ చీఫ్గా ఎస్శ్రీనివాసన్ పనిచేశారు. కాగా, కన్ఫర్డ్ ఐపీఎస్అంటే, రాష్ట్ర పోలీసు సర్వీసులో ఉన్న అధికారులకు భారతీయ పోలీసు సేవ(IPS)లో పదోన్నతి ఇవ్వడం. ఇది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. యూపీఎస్సీ ఆధ్వర్యంలో ఒక కమిటీ సమావేశమై, అర్హత కలిగిన ఎస్పీఎస్ అధికారుల పేర్లను పరిశీలించి, ఐపీఎస్లుగా పదోన్నతి ఇవ్వాలని నిర్ణయిస్తుంది. పదోన్నతి పొందిన వారు ఐపీఎస్ అధికారులుగా గుర్తింపు పొందుతారు,


