ఎముకలు కొరకని చలి!

Temperature Drops Below 5 Degrees In Parts Of Telangana - Sakshi

సాధారణ స్థాయికి చేరుకుంటున్న కనిష్ట ఉష్ణోగ్రతలు

రాష్ట్రంలో అత్యల్పంగా మెదక్‌లో 8.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణస్థితికి చేరుకుంటున్నాయి. వారంరోజులుగా సాధారణం కంటే 5 డిగ్రీల మేర పతనమైన ఉష్ణోగ్రతలు ఇప్పుడు పెరుగుతున్నాయి. శుక్రవారం మెదక్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 8.8 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రత దుండిగల్, నల్లగొండలో 32 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. రానున్న రెండ్రోజులు  సాధారణం కంటే 2 డిగ్రీల మేర తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top