దసరాకు ప్రత్యేక రైళ్లు | Special trains for Dussehra | Sakshi
Sakshi News home page

దసరాకు ప్రత్యేక రైళ్లు

Oct 20 2023 3:53 AM | Updated on Oct 20 2023 3:53 AM

Special trains for Dussehra - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దసరా సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ మేరకు సికింద్రాబాద్‌–సంత్రాగచ్చి (07645/07646) స్పెషల్‌ ట్రైన్‌ ఈ నెల 20న ఉదయం 8.40కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.40కి సంత్రాగచ్చి చేరుకుంటుంది.

తిరుగు ప్రయాణంలో 21వ తేదీ మధ్యాహ్నం 12.20కి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. సికింద్రాబాద్‌–నర్సాపూర్‌ (07062) ఈ నెల 22వ తేదీ రాత్రి 10.05 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.10 కి నర్సాపూర్‌ చేరుకుంటుంది. నాందేడ్‌–కాకినాడ (07055/07056) స్పెషల్‌ ట్రైన్‌ 21వ తేదీ మధ్యాహ్నం గం.3.25కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.30కు కాకినాడ చేరుకుంటుంది.

తిరుగు ప్రయాణంలో 22వ తేదీ రాత్రి 9 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం ఒంటిగంటకు నాందేడ్‌ చేరుకుంటుంది. విశాఖపట్టణం–కర్నూల్‌ (08585/08586) స్పెషల్‌ ట్రైన్‌ ఈ నెల 24, 31, నవంబర్‌ 7, 14 తేదీల్లో సాయంత్రం 5.35కు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.35కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 25, నవంబర్‌ 1, 8, 15 తేదీల్లో మధ్యాహ్నం 3.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.50 కి విశాఖ చేరుకుంటుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement