2025 సంవత్సరానికి గానూ రాష్ట్రప్రభుత్వం ప్రకటించే గద్దర్ అవార్డ్స్ లో స్పెషల్ జ్యురీ అవార్డు పొందిన 23 (ఇరవై మూడు) చిత్ర బృందానికి జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్రా ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభకు ఆమె హాజరయ్యారు.ఈ సినిమా నిర్మాణం అత్యంత బాధ్యత, కష్టంతో కూడుకున్నదని ఈ సినిమా చాలా ప్రభావవంతం గా ఉందని సౌమ్యామిశ్రా అన్నారు.
జైలు జీవితాలను ఇంత వాస్తవికతంగా ఎవరూ తెరమీద చూపించలేదని ది షాషాంక్ రిడెంప్షన్ వంటి గొప్ప చిత్రాల సరసన నిలబడే చిత్రం 23 అని అన్నారు. ఈ సినిమా ఖచ్చితంగా జైలులోని ఖైదీలు చూసేలా ఏర్పాట్లు చేస్తానని తెలిపారు. కొంతమంది ఖైదీలలో మార్పు వచ్చినా అది గొప్పమార్పేనని సౌమ్యామిశ్రా పేర్కొన్నారు.
అనంతరం దర్శకుడు రాజ్ మాట్లాడుతూ..ఈ చిత్ర ప్రయాణంలో తనకు తోడున్న సభ్యులందరికీ కృతజ్ఞతలని ఈ సినిమా ప్రయాణం చాలా ప్రత్యేకమని తెలిపారు. ఈ సినిమా నిర్మించిన ప్రయోజనం నెరవేరాలంటే జైళ్లలో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. 23 వంటి సామాజిక దృక్పథం ఉన్న సినిమాలకు ప్రభుత్వం ప్రోత్సాహాలు అందించాలని దర్శకుడు బి. నర్సింగరావు కోరారు. ఈ కార్యక్రమం సినీ ఇండస్ట్రీకి చెందిన ఇతర ప్రముఖులు పాల్గొన్నారు


