14న దక్షిణాది రాష్ట్రాల సీఎంలతో అమిత్‌షా భేటీ 

Southern Council Meet In Tirupati On November 14 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లోని  తిరుపతిలో ఈ నెల 14న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా నేతృత్వంలో దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్‌ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్‌ రావు, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాల నేపథ్యంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో తమ వాదనలు వినిపించే అవకాశం ఉంది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top