పలు రూట్లలో ప్రత్యేక రైళ్లు 

South Central Railway Special Trains Runs On Several Routes Due To Rush - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్‌–తిరుపతి (07691/07692) స్పెషల్‌ ట్రైన్‌ ఈనెల 26 రాత్రి 7 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రాత్రి 9.55 గంటలకు తిరుపతి నుంచి బయ ల్దేరి మరుసటి రోజు ఉదయం 10.10 గంటలకు నాంపల్లికి చేరుకుంటుంది.

సికింద్రాబాద్‌–యశ్వంత్‌పూర్‌ (07193/ 07194) స్పెషల్‌ ట్రైన్‌ ఈనెల 29న మధ్యాహ్నం 3.15 గంటలకు బయల్దేరి మరుసటి రోజు తెల్లవారు జామున 4 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 30న సాయంత్రం 5.20 గంటలకు యశ్వంత్‌పూర్‌ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6.45 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. హైదరాబాద్‌–నాగర్‌సోల్‌ (07089/07090) ప్రత్యేక రైలు ఈనెల 24న రాత్రి 7 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9.25 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈనెల 25 రాత్రి 10 గంటలకు నాగర్‌సోల్‌ నుంచి బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్‌ చేరుకుంటుంది.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top