సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) కరోనా వ్యాధి నిర్ధారణకు అభివృద్ధి చేసిన ఓ వినూత్న పద్ధతికి భారత వైద్య పరిశోధన సమాఖ్య (ఐసీఎంఆర్) గుర్తింపు లభించింది. కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి వైరస్ నమూనాలను సీసీఎంబీలో పరీక్షిస్తుండగా... ఆయా పరీక్షా పద్ధతుల్లో చోటుచేసుకుంటున్న లోటుపాట్లను సవరిస్తూ శాస్త్రవేత్తలు కొత్త పద్ధతిని రూపొందించారు. ప్రస్తుతం కరోనా అనుమానితులకు చేసే పరీక్షల్లో భాగంగా ముక్కు లేదా గొంతు లోపల స్వాబ్స్ను ఉంచి శరీర ద్రవాల నమూనాలు సేకరించి వాటిని పరీక్ష కేంద్రాలకు తరలిస్తున్నారు.
రవాణా సమయంలో స్వాబ్స్ను వైరల్ ట్రాన్స్పోర్ట్ మీడియం (వీటీఎం) పేరున్న ద్రావణంలో ఉంచుతున్నారు. అయితే ఈ ద్రావణం బయటకు రాకుండా నమూనాలను ప్యాక్ చేసే క్రమంలో ఎంతో సమయం వృధా అవుతోందని సీసీఎంబీ శాస్త్రవేత్తలు గుర్తించారు. పైగా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో వీటీఎం లీక్ అవుతున్నట్లు కూడా తెలిసింది. దీనివల్ల ఆయా నమూనాలు పరీక్షించేందుకు పనికిరాకుండా పోవ డమే కాకుండా అవి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుందని తేలింది. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిన సీసీఎంబీ... వీటీఎంను పూర్తిగా నివారించవచ్చని గుర్తించింది. పొడిగా ఉండే స్వాబ్ ద్వారా రైబోన్యూక్లిక్ యాసిడ్ (ఆర్ఎన్ఏ)ను వేరు చేయాల్సిన అవసరం కూడా రాదని, నేరుగా ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు జరపవచ్చని శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. ఈ పద్ధతిని ఇప్పుడు ఐసీఎంఆర్ కూడా గుర్తించింది. ఆర్ఎన్ఏ వెలికితీతకు తగిన సౌకర్యాలు లేనిచోట ఈ పద్ధతిని వాడవచ్చని తెలిపింది.
సమయం కలిసొస్తుంది: డాక్టర్ రాకేశ్ మిశ్రా
సీసీఎంబీ అభివృద్ధి చేసిన డ్రై స్వాబ్ టెక్నిక్ ద్వారా కరోనా పరీక్షల్లో ఎంతో సమయం ఆదా అవుతుందని సంస్థ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. ఆటోమేషన్ పద్ధతిలో నిర్వహించే ఆర్ఎన్ఏ వెలికితీత కోసం 500 నమూనాలకు సుమారు 4 గంటల సమయం పడుతుందని ఆయన చెప్పారు. వీటీఎం, ఆర్ఎన్ఏ వెలికితీత వల్ల ఖర్చులు, ఫలితాల వెల్లడికి పట్టే సమయం పెరిగిపోతాయని, భారీ సంఖ్యలో నమూనాలను పరీక్షించాల్సిన పరిస్థితుల్లో వాటిని పరిహరించేందుకు కొత్త పద్ధతి ఉపయోగపడుతుందని వివరించారు. డ్రై స్వాబ్ టెక్నిక్ను వాడటం ద్వారా పరీక్షల ఖర్చు 40–50 శాతం తగ్గుతుందని తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యవస్థల ద్వారానే కొత్త రకం పరీక్షలను నిర్వహించగలగడం మరో విశేషమన్నారు.
లే'టెస్ట్' డ్రై స్వాబ్..
Published Sat, Nov 28 2020 4:53 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement