హ్యాకైన తెలంగాణ కేబినెట్ మంత్రుల వాట్సాప్ గ్రూప్స్‌? | Telangana Cabinet Minister WhatsApp Groups Hacked By Cyber Criminals, Government Officials Communication Affected | Sakshi
Sakshi News home page

హ్యాకైన తెలంగాణ కేబినెట్ మంత్రుల వాట్సాప్ గ్రూప్స్‌?

Nov 23 2025 1:13 PM | Updated on Nov 23 2025 4:48 PM

Cybercriminals hacked the WhatsApp groups of Telangana cabinet ministers.

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణలో వాట్సాప్‌ గ్రూప్స్‌ హ్యాకింగ్‌ కలకలం రేపుతోంది. భారతీయ స్టేట్ బ్యాంకు(ఎస్‌బీఐ), ఆధార్‌ అప్‌డేట్‌ పేరుతో పలువురు తెలంగాణ కేబినెట్ మంత్రులకు జర్నలిస్టుల వాట్సాప్ గ్రూపులను సైబర్‌ నేరస్తులు హ్యాక్‌ చేసినట్లు సమాచారం. 

ఎస్‌బీఐ, ఆధార్‌ అప్‌డేట్‌ పేరుతో హ్యాకర్లు APK ఫైల్స్‌ను పంపి, వాటిని ఓపెన్‌ చేసిన వెంటనే ఫోన్‌ను తమ నియంత్రణలోకి తీసుకుంటున్నారు. తొలుత ఓ జర్నలిస్టుకు సంబంధించిన ఫోన్ హ్యాక్ అయినట్లు తెలుస్తోంది. అతని ఫోన్ నుంచి హ్యాకర్లు మీడియా సంబంధిత గ్రూపులను(మంత్రుల అధికారిక గ్రూపులు, సీఎంవో గ్రూప్‌, డిప్యూటీ సీఎం గ్రూప్‌‌లు) ప్రభావితం చేస్తున్నట్లు తెలిసింది. ఆయా గ్రూపుల్లో ఎస్‌బీఐ-ఆధారం లింకు పేరుతో ఏపీకే ఫైల్స్ ప్రత్యక్షమయ్యాయి. అయితే.. మంత్రు పీఆర్వోల ఫోన్లు, జర్నలిస్టుల ఫోన్లు హ్యాకయ్యాయంటూ తొలుత వార్తలు వెలువడ్డాయి.  దీనిపై సీఎంవో గ్రూపు అడ్మిన్ స్పందిస్తూ.. ‘‘సీఎంవో గ్రూపు సేఫ్’’ అని సమాచారం అందజేశారు.

వాట్సాప్‌ గ్రూప్స్‌ హ్యాక్‌ అవుతున్నాయంటూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వార్తలతో తెలంగాణ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. హ్యాకైన వాట్సాప్‌ గ్రూపులను హ్యాకర్లను సురక్షితంగా ఉంచారు.  

వాట్సాప్‌ గ్రూప్‌ల హ్యాకింగ్‌పై  సైబర్‌ క్రైమ్‌ నిపుణులు పలు సూచనలు జారీ చేశారు. ఏపీకే ఫైల్స్‌ వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్‌ చేయొద్దంటూ జర్నలిస్టుల్ని హెచ్చరిస్తున్నారు. ‘ఏపీకే ఫైల్స్‌ ఓపెన్‌ చేయొద్దు, అనుమానాస్పద లింకులు క్లిక్‌ చేయొద్దుంటూ’ అప్రమత్తం  చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement