తొలిలాగే మలి! | Congress Wave continued in Second phase of telangana panchayat elections | Sakshi
Sakshi News home page

తొలిలాగే మలి!

Dec 15 2025 1:12 AM | Updated on Dec 15 2025 1:12 AM

Congress Wave continued in Second phase of telangana panchayat elections

ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరిన ఓటర్లు

రెండో విడతలోనూ కాంగ్రెస్‌దే ‘పైచేయి’...

55% స్థానాల్లో అధికార పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులదే విజయం

బీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థుల్లో 29% మంది గెలుపు.. తర్వాతి స్థానంలో బీజేపీ 

సత్తా చాటుతున్న స్వతంత్రులు.. ఈసారి కూడా గణనీయంగా విజేతలు

రెండో విడత ఫలితాలు ఇలా..

కాంగ్రెస్‌        2,067 
బీఆర్‌ఎస్‌    1,160 
బీజేపీ    250
ఇతరులు    429

రెండో విడతలో 85.86% ఓటింగ్‌

తొలి విడత కంటే 1.58% ఎక్కువ

సాక్షి, హైదరాబాద్‌: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ దాదాపుగా తొలి విడత ఫలితాలే పునరావృతమయ్యాయి. మొదటి విడత తరహాలోనే రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీ స్థానాల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ బలపర్చిన సర్పంచ్‌ అభ్యర్థులే విజయం సాధించారు. 

ఆదివారం రాష్ట్రంలోని 3,911 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా.. కాంగ్రెస్‌ మద్దతు పలికిన అభ్యర్థులు 2,067 మంది గెలుపొందారు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులు 1,160 స్థానాలు గెలుపొందగా, బీజేపీ బలపర్చిన అభ్యర్థులు 250 మంది గెలిచారు. 

మరోవైపు స్వతంత్రులు, సీపీఎం, సీపీఐ పారీ్టలకు చెందిన వారు.. 429 మంది గెలుపొందారు. వీరు మొత్తం స్థానాల్లో 11 శాతానికి పైగానే గెలుపొందడం విశేషం. ఇక రెండు విడతల్లో కలిపి కాంగ్రెస్‌ బలపర్చగా గెలిచిన వారి సంఖ్య 4,500 దాటింది. 

బీఆర్‌ఎస్‌ బలపర్చిన 2,300 మంది విజయం సాధించగా, బీజేపీ బలపర్చిన వారు 440 మంది వరకు గెలుపొందినట్లు గణాంకాలు చెబుతున్నాయి. రెండో విడతకు సంబంధించి 416 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఎవరికి ఎంత శాతం..?
తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో మాదిరిగానే రెండో విడతలో కూడా 55 శాతం వరకు పంచాయతీలు కాంగ్రెస్‌ బలపర్చిన వారికే దక్కగా, అదే సమయంలో బీఆర్‌ఎస్‌ సైతం మంచి పోటీ ఇచి్చంది. ఆ పారీ్టకి 29 శాతం కంటే ఎక్కువగా పంచాయతీలు దక్కాయి. బీజేపీ మద్దతిచి్చన వారు 6 శాతానికి పైగా విజయం సాధించారు.  


 

Advertisement
 
Advertisement
Advertisement