ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందన | - | Sakshi
Sakshi News home page

ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందన

Nov 3 2025 7:02 AM | Updated on Nov 3 2025 7:02 AM

ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందన

ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందన

శ్రీసిటీ,(సత్యవేడు) : ఎల్‌వీఎం3–ఎం5 రాకెట్‌ ప్రయోగం విజయవంతమవడంతో శ్రీసిటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రవీంద్ర సన్నారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో చైర్మన్‌ వి.నారాయణన్‌, షార్‌ డైరెక్టర్‌ ఈఎస్‌ పద్మకుమార్‌ , శాస్త్రవేత్తలు, ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. ఇప్పటి వరకు ప్రయోగించిన ఉపగ్రహాల్లో ఇదే అత్యంత బరువైందని పేర్కొన్నారు. భారతనౌకాదళానికి, కమ్యూనికేషన్స్‌ పరంగా ఇది కొత్త శక్తిని అందించగలదని, తద్వారా హిందూ మహాసముద్రంలో రక్షణ వ్యవస్థ మరింత పటిష్టమవుతుందని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement