108 ఆసనాలతో ప్రత్యేక ప్రతిభవంతుల ప్రపంచ రికార్డు | - | Sakshi
Sakshi News home page

108 ఆసనాలతో ప్రత్యేక ప్రతిభవంతుల ప్రపంచ రికార్డు

Jun 22 2025 7:15 AM | Updated on Jun 22 2025 7:15 AM

108 ఆ

108 ఆసనాలతో ప్రత్యేక ప్రతిభవంతుల ప్రపంచ రికార్డు

తెలుగు లోగిళ్లలో యోగా సంబరాలు

తిరువళ్లూరు: జిల్లాలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన సుమారు వంద మంది ప్రత్యేక ప్రతిభావంతులు 108 యోగాసనాలను ప్రదర్శించి నోవా ప్రపంచ రికార్డులో స్థానం సంపాదించారు. దివ్యాంగులు, బధిరులకు యోగాలో ప్రత్యేక శిక్షణ ఇచ్చి, వారిని ప్రోత్సహించాలని హ్యాపీ యోగా హెల్త్‌కేర్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు సెంథిల్‌కుమార్‌, గీత ప్రయత్నించారు. ఇందులో భాగంగానే దివ్యాంగులు, బధిరులు సుమారు వంద మందిని ఎంపిక చేసి, వారికి మూడు రోజులపాటు యోగాలోని 108 ఆసనాలు వేయడంలో శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తయిన నేపథ్యంలో మనవాలనగర్‌లోని ప్రైవేటు మండపంలో నోవా ప్రపంచ రికార్డులో స్థానం సంపాదించడానికి ఆసనాలను ప్రదర్శించారు. సుమారు మూడు గంటల పాటు జరిగిన కార్యక్రమంలో ప్రత్యేక ప్రతిభావంతులు 108 ఆసనాలను ప్రదర్శించి నోవా ప్రపంచ రికార్డును సాధించారు. కాగా ప్రత్యేక ప్రతిభావంతులు చేసిన యోగాసనాలు అందరిని ఆకట్టుకున్నాయి.

కరూరులో 6వేల మందితో యోగా

సేలం: కరూర్‌ భరణి పార్క్‌ ఎడ్యుకేషనల్‌ కాంప్లెక్స్‌లో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచ సాధారణ ప్రార్థన తిరుక్కురల్‌ పారాయణంతో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో 6వేల మంది పాల్గొన్నారు. కార్యక్రమానికి భరణి పార్క్‌ విద్యాకమిటీ అధ్యక్షుడు ఎస్‌.మోహనరంగన్‌ అధ్యక్షత వహించారు. కార్యదర్శి పద్మావతి మోహనరంగన్‌, ట్రస్టీ సుభాషిణి అశోక్‌శంకర్‌ పాల్గొన్నారు. భరణి పార్క్‌ ఎడ్యుకేషనల్‌ గ్రూప్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సి. రామసుబ్రమణియన్‌ మాట్లాడుతూ ‘అందరికీ ప్రయోజనకరమైన యోగా కళ, మన మాతృభూమి ఈ ప్రపంచానికి ఇచ్చిన బహుమతి అన్నారు. భరణి పార్క్‌ ఎడ్యుకేషనల్‌ గ్రూప్‌ నుంచి 6 వేల మంది అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్నారు.

యోగా శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

వేలూరు: యోగా శిక్షణను విద్యార్థులతోపాటు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని శ్రీపురం బంగారుగుడి నారాయణి ఆస్పత్రి డైరెక్టర్‌ బాలాజీ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నారాయణి మండపంలో యోగా శిక్షణను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి, ప్రారంభించారు. అనంతరం ఆయన విద్యార్థులు, సిబ్బందితో కలిసి యోగాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐక్యరాజ్యసమతి ద్వారా జూన్‌ 21వ తేదీని ప్రపంచ యోగా దినోత్సవంగా గత 2015వ సంవత్సరంలో ప్రకటించడం జరిగిందన్నారు. ఈ యోగాను మన సిద్దర్‌ గత ఐదు వేల సంవత్సరాల క్రితమే చేశారన్నారు. ప్రపంచంలోని ప్రజలు తెలుసుకునేలా ఈ యోగా ప్రాధాన్యతను ప్రకటించడం అభినందనీయమన్నారు. ఇది ఒక రోజు శిక్షణ కాదని, ప్రతి రోజూ దీన్ని అలవాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సిబ్బంది, నారాయణి పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే వేలూరు నేతాజీ మైదానంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమాన్ని ఎస్పీ మదివాణన్‌ ప్రారంభించారు.

వీఐటీ యూనివర్సిటీలో..

వేలూరు వీఐటీ యూనివర్సిటీలో యోగా శిక్షణను జైళ్లశాఖ డైరెక్టర్‌ ప్రదీప్‌ ప్రారంభించారు. వీఐటీ క్రీడా మైదానంలో జరిగిన ఈ యోగా శిక్షణలో వీఐటీలోని విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని, శిక్షణ పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శారీరకంగా, మానసిక రుగ్మతలను పారద్రోలి సర్వరోగి నివారణిగా యోగా దోహద పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వీఐటీ వైస్‌ చాన్సలర్‌ కాంచన, ఫ్రో చాన్సలర్‌ పార్థసారథి మల్లిక్‌, పిజికల్‌ పిట్‌నెస్‌ డైరెక్టర్‌ మంగయకరసి, అరుణ్‌ పాల్గొన్నారు.

కొరుక్కుపేట: చైన్నెలోని తెలుగు లోగిళ్లలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యోగా, ధ్యానం ప్రాముఖ్యతను వివరిస్తూ మరోవైపు యోగా విన్యాసాలతో అబ్బుర పరిచారు.

ఎస్‌కేపీడీ విద్యాసంస్థల్లో..

ఎస్‌కేపీడీ చారిటీస్‌ నిర్వహణలో కొనసాగుతున్న ఎంవీఎం సీనియర్‌ సెకండరీ స్కూల్‌ – చూలైలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. పాఠశాల కరస్పాండెంట్‌ టీవీ రామకుమార్‌, ప్రిన్సిపల్‌ పి.సుబ్రహ్మణ్యం నేతృత్వంలో యోగ దినోత్సవం జరిగింది. విద్యార్థినీ విద్యార్థులు యోగాసనాలతో అబ్బుర పరిచారు. అనంతరం వారు మాట్లాడుతూ యోగాతో శారీరక ఆరోగ్యంతోపాటు సమగ్ర అభివృద్ధికి పాఠశాల ప్రాధాన్యత ఇస్తుందన్నారు. యోగా పాఠశాల పాఠ్యాంశాల్లో అంతర్భాగం అని, విద్యార్థులలో మానసిక, శారీరక సమతుల్యతను ప్రోత్సహిస్తుందన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు, విద్యార్థులు వివిధ యోగా ఆసనాలు, ప్రాణాయామం, ధ్యాన సెషన్లలో పాల్గొని, ఐక్యత, శ్రేయస్సును పెంపొందించారని కొనియాడారు. క్రమం తప్పకుండా యోగా సాధన చేయడంతో విద్యార్థులు స్వీయ క్రమశిక్షణ, ఏకాగ్రత, సృజనాత్మకత అభివృద్ధి చెందడానికి సహాయపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల మేనేజర్‌ శ్రీలత పాల్గొన్నారు.

పిరమిడ్‌ స్పిరుచువల్‌ సొసైటీ మూమెంట్స్‌

అంతర్జాతీయ యోగా డే సందర్భంగా పిరమిడ్‌ స్పిరుచువల్‌ సొసైటీ మూమెంట్స్‌, మహర్షి విద్యామందిర్‌ తిరువొత్తియూర్‌ సంయుక్త ఆధ్వర్యంలో యోగా డేను ఘనంగా నిర్వహించారు. వక్తలుగా చైన్నె పిరమిడ్‌ స్పిరుచువల్‌ సొసైటీ సెక్రటరీ అమరా చంద్రశేఖర్‌తో పాటు చంద్రకళ, వందన మాట్లాడుతూ యోగా, ధ్యానంతో శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. అలాగే మెదడులో నాడీవ్యవస్థ చురుగ్గా పనిచేస్తాయన్నారు. దీంతో పిల్లలకు జ్ఞాపకశక్తి, ఉన్నత లక్ష్యాలు కలిగి సరైన పద్ధతితో జీవన విధానం కలుగుతాయని చెప్పారు. యోగా, ధ్యానంతో ఆరోగ్యం చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హర్షిణి, భాగ్యం, నర్మదా తదితరులు పాల్గొన్నారు.

శ్రీ కనకదుర్గ తెలుగు పాఠశాలలో :

చైన్నె విల్లివాక్కంలోని శ్రీ కనకదుర్గ తెలుగు మహోన్నత పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శనివారం ఉదయం ఘనంగా జరుపుకున్నారు. ముఖ్య అతిథిగా ఏఐటీఎఫ్‌ అధ్యక్షులు, పాఠశాల నిర్వాహకులు ఆచార్య సీఎంకేరెడ్డి, గౌరవ అతిథిగా ఎస్‌కేడీటీ మహోన్నత పాఠశాల కస్పాండెంట్‌ డాక్టర్‌ సీఎం కిషోర్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎస్‌ శారాసుహాసిని స్వాగతోపన్యాసం చేయగా, సహాయ ప్రధానోపాధ్యాయులు అళగరాజ్‌ వందన సమర్పణ చేశారు. ఏఐటీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి ఆర్‌ నందగోపాల్‌. పాఠశాల కోశాధికారి ఎన్‌ నరసింహులు, నమో గాడ్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ట్రస్టీ ఎన్‌.నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

108 ఆసనాలతో ప్రత్యేక ప్రతిభవంతుల ప్రపంచ రికార్డు 1
1/6

108 ఆసనాలతో ప్రత్యేక ప్రతిభవంతుల ప్రపంచ రికార్డు

108 ఆసనాలతో ప్రత్యేక ప్రతిభవంతుల ప్రపంచ రికార్డు 2
2/6

108 ఆసనాలతో ప్రత్యేక ప్రతిభవంతుల ప్రపంచ రికార్డు

108 ఆసనాలతో ప్రత్యేక ప్రతిభవంతుల ప్రపంచ రికార్డు 3
3/6

108 ఆసనాలతో ప్రత్యేక ప్రతిభవంతుల ప్రపంచ రికార్డు

108 ఆసనాలతో ప్రత్యేక ప్రతిభవంతుల ప్రపంచ రికార్డు 4
4/6

108 ఆసనాలతో ప్రత్యేక ప్రతిభవంతుల ప్రపంచ రికార్డు

108 ఆసనాలతో ప్రత్యేక ప్రతిభవంతుల ప్రపంచ రికార్డు 5
5/6

108 ఆసనాలతో ప్రత్యేక ప్రతిభవంతుల ప్రపంచ రికార్డు

108 ఆసనాలతో ప్రత్యేక ప్రతిభవంతుల ప్రపంచ రికార్డు 6
6/6

108 ఆసనాలతో ప్రత్యేక ప్రతిభవంతుల ప్రపంచ రికార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement