పల్లిపాళయం వద్ద దుండగుల దుశ్చర్య | - | Sakshi
Sakshi News home page

పల్లిపాళయం వద్ద దుండగుల దుశ్చర్య

Jun 22 2025 7:15 AM | Updated on Jun 22 2025 7:15 AM

పల్లిపాళయం వద్ద  దుండగుల దుశ్చర్య

పల్లిపాళయం వద్ద దుండగుల దుశ్చర్య

● ఒకే రైతుకు చెందిన చెరుకుతోటకు 4 సార్లు నిప్పు

తిరువొత్తియూరు: నామక్కల్‌ జిల్లా, పల్లిపాలయం సమీపంలోని మొలాసి మునియప్ప పాలయంకు చెందిన రైతు తంగవేల్‌ (70) ఆరు ఎకరాల్లో చెరుకు నాటారు. ఈ ప్రాంతానికి చెందిన చాలా మంది రైతులు దాదాపు 100 ఎకరాల్లో చెరకు సాగు చేశారు. ఈ క్రమంలో గురువారం రాత్రి, 8.00 గంటల సమయంలో తంగవేల్‌ చెరకు తోటకు అకస్మాత్తుగా నిప్పు అంటుకొని మంటలు చెలరేగాయి. దీని తరువాత, ఆ ప్రాంతంలోని చాలా మంది రైతులు గుమిగూడి నీరు పోసి మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత, రాత్రి 10 గంటల ప్రాంతంలో తంగవేల్‌ చెరకు తోటలో మరోసారి మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రాత్రి 12 గంటల ప్రాంతంలో 3 వ సారి మంటల్లో చిక్కుకుంది. షాక్‌కు గురైన ఆ ప్రాంతంలోని రైతులు మళ్లీ గుమిగూడి మంటలను ఆర్పారు. తంగవేల్‌ తోట దగ్గర చాలా చెరుకు తోటలు ఉన్నప్పటికీ. ఒకే రాత్రిలో 3 సార్లు తంగవేల్‌ అనే రైతుకు చెందిన చెరుకు తోటలోని అనేక మూలల్లో మంటలు చెలరేగాయి. ఇది రైతులను దిగ్భ్రాంతికి గురిచేసింది. మూడుసార్లు మంటల్లో చిక్కుకుని దాదాపు 2.5 ఎకరాల్లో పండించిన రూ.5 లక్షల విలువైన చెరుకును నాశనం అయినట్టు తెలిసింది . దీనిపై ఎస్పీ రాజేష్‌ కన్నన్‌, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు ఈ క్రమంలో 4వ సారి కూడా తంగవేలు చెరుకు తోటకు శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో భద్రత కోసం ఆ ప్రాంతంలో పోలీసులను మోహరించారు. దర్యాప్తు కొనసాగుతోంది.

సిరులతల్లి సేవలో సినీనటి

చంద్రగిరి : తిరుచానూరు పద్మావతి అమ్మవారిని సినీనటి విద్యాబాలన్‌ శనివారం సేవించుకున్నారు. ఆలయం వద్ద ఆమెకు అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు.

ఘనంగా అక్కమ్మ దేవత తిరునాళ్లు

గుడిపాల: మండలంలోని రామభద్రాపురం గ్రామంలో ఉన్న గ్రామదేవత అక్కమ్మ దేవత తిరునాళ్లు శనివారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా అమ్మవారికి అభిషేకం నిర్వహించి, విరుపాక్షమ్మ దగ్గర పొంగళ్లు పెట్టి నైవేద్యం సమర్పించి మేళతాళాలు మధ్య, బాణసంచావేడుకలతో వైభవంగా ఉత్సవమూర్తులు అమ్మవారి గెరిగలను జోడించి ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ గోళ్ల హరిప్రసాద్‌, గ్రామస్తులు సురేంద్రబాబు, అమరేంద్రబాబు, వరదరాజులు, సురేంద్రనాయుడు, శ్రీధర్‌, ధనంజయ, గోవర్ధన్‌, వినాయక, నరసింహ, మనుమంతనాయుడు, సందీప్‌, చరణ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement