డిజ్జీ వరల్డ్‌ ఇన్‌స్టా రీల్స్‌ విజేతలకు బహుమతులు | - | Sakshi
Sakshi News home page

డిజ్జీ వరల్డ్‌ ఇన్‌స్టా రీల్స్‌ విజేతలకు బహుమతులు

Jun 22 2025 7:14 AM | Updated on Jun 22 2025 7:14 AM

డిజ్జీ వరల్డ్‌ ఇన్‌స్టా రీల్స్‌ విజేతలకు బహుమతులు

డిజ్జీ వరల్డ్‌ ఇన్‌స్టా రీల్స్‌ విజేతలకు బహుమతులు

సాక్షి,చైన్నె : వేసవి సందర్భంగా ఎంజీఎం డిజ్జీ వరల్డ్‌ నేతృత్వంలో సోషల్‌ మీడియా బ్లాక్‌ బస్టర్‌గా ఇన్‌స్ట్రాగామ్‌ రీల్స్‌ పోటీలను నిర్వహించారు. 500 మందికి పైగా ఔత్సాహికులు 90 సెకన్లతో ప్రత్యేక ఆకర్షణతో కూడిన రీల్స్‌ను ఏప్రిల్‌ 11 నుంచి మే 31 వరకు పంపించారు. రోలర్‌ కోస్టర్‌ క్షణాలను ఇన్‌ స్ట్రాగామ్‌ రీల్స్‌గా మార్చారు. తమలోని సృజనాత్మకను చాటుకున్నారు. ఈ రీల్స్‌ అన్నింటిని పరిశీలించి విజేతలను ఎంపిక చేయడానికి ప్రత్యేక కమిటీని డిజ్జీ వరల్డ్‌ నియమించింది. న్యాయ నిర్ణేతల కమిటీ చివరకు 10 మందిని ఎంపిక చేశారు. వీరిలో తొలి బహుమతిగా మరియం అన్సారికి రూ.2 లక్షలు, రెండో బహుమతిగా సరస్వతికి రూ.లక్ష, మూడో బహుమతిగా శరవణకుమార్‌కు రూ. 60 వేలు అందజేశారు. మిగిలిన ఏడుగురికి కన్సోలేషన్‌ బహుమతిగా తలా రూ. 20 వేలు చొప్పన అందజేశారు. శనివారం జరిగిన కార్యక్రమంలో విజేతలకు ఎంజీఎం డిజ్జీ వరల్డ్‌ ఏజీఎం కృష్ణమూర్తి, ఎంజీఎం హోటల్స్‌ ఉపాధ్యక్షుడు దీరజ్‌కుమార్‌, డిజ్జీ వరల్డ్‌ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ సెంథిల్‌, బీచ్‌ రిసార్ట్‌ జీఎం మురళీ ధర వెంకటరామన్‌ బహమతులకు గాను చెక్కులను అందజేసి సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement