ఐటమ్‌ సాంగ్స్‌కు సై అన్న మరో నాయకి | - | Sakshi
Sakshi News home page

ఐటమ్‌ సాంగ్స్‌కు సై అన్న మరో నాయకి

Jun 22 2025 7:14 AM | Updated on Jun 22 2025 7:14 AM

ఐటమ్‌ సాంగ్స్‌కు సై అన్న మరో నాయకి

ఐటమ్‌ సాంగ్స్‌కు సై అన్న మరో నాయకి

తమిళసినిమా: ప్రముఖ కథానాయకులు ఐటమ్‌ సాంగ్స్‌కు సై అనడం అనేది చాలా కాలం క్రితం మొదలైంది. రెండు మూడు రోజుల్లో నటిస్తే చాలు మంచి పారితోషికం తోపాటు పబ్లిసిటీ లభించడమే ఇందుకు కారణం. అలా ఐటమ్‌ సాంగ్స్‌తో బాగా పాపులర్‌ అయిన నటి తమన్న. ఈమె ఐటెం సాంగ్‌లో నటిస్తే అభిమానుల గుండె గుల్లే. నిర్మాతలకు, పంపిణీదారులకు గలాటా గలగలే. నటి సమంత, కాజల్‌ అగర్వాల్‌ వంటి వారు ఇందుకు అతీతం కాదు. కాగా తాజాగా నటి గాయత్రి కూడా ఐటమ్‌ సాంగ్‌ బాట పట్టారు. బెంగళూరుకు చెందిన ఈ తమిళ భామ మలయాళం, తమిళ భాషల్లో కథానాయకిగా నటించి పాపులర్‌ అయ్యారు. 18 వయదు అనే చిత్రం ద్వారా కోలీవుడ్‌లో కథానాయకిగా పరిచయమైనా ఆ చిత్రం విడుదల కాలేదు. ఆ తర్వాత విజయ్‌ సేతుపతికి జంటగా నటించిన నడుముల కొంచెం పక్కత్త కానోం చిత్రం అనుహ్య విజయాన్ని సాధించింది. ఆ తర్వాత గాయత్రికి తమిళంలో వరుసగా అవకాశాలు తలుపు తట్టాయి. అలా పొన్మాలై పొళుదు, రమ్మీ, ఫురియాద పుదీర్‌, కాదలుమ్‌ కడందు పోగుమ్‌, ఒరు నల్లనాళ్‌ పాత్తు సొల్రేన్‌, సీతకాత్తి, సూపర్‌ డీలక్స్‌, మామనిధన్‌, విక్రమ్‌ తదితర చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. కాగా ఈమె తమిళంలో ఎక్కువగా విజయ్‌ సేతుపతికి జంటగా నటించడం విశేషం. మలయాళంలోనూ పరిసరాలు నటించిన గాయత్రికి ప్రస్తుతం అవకాశాలు తగ్గాయని తెలుస్తోంది. దీంతో ఈ అమ్మడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో పడ్డట్టున్నారు. అందులో భాగంగానే ఐటమ్‌ సాంగ్స్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. అధర్వ కథానాయకుడిగా నటించిన డీఎన్‌ఏ చిత్రంలో ఐటెమ్‌ సాంగ్‌లో మెరిశారు. అందులో కాంగ్రెస్‌లో వచ్చే బార్‌ సాంగ్‌లో గాయత్రి అందాలు ఆరబోస్తూ నటించడం విశేషం. ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. కాగా ఇప్పటివరకు కుటుంబ కథా చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న గాయత్రి ఇప్పుడు ఐటెమ్‌ సాంగ్‌లో నటించడం ఆమె అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే కురక్రారు మాత్రం గాయత్రి శృంగార భరిత నటనను ఎంజాయ్‌ చేస్తున్నారు.

నటి గాయత్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement