
తాటి చెటెక్కిన సీమాన్
– కల్లు గీతకు అనుమతి కోసం నిరసన
సాక్షి, చైన్నె: నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ తాటి చెట్టెక్కి మరీ నిరసన తెలియజేశారు. కల్లుగీతకు అనుమతి ఇవ్వాలని నినదిస్తూ తాటి చెట్టుపై ఉన్న కల్లు కుండలను కిందకు దించి, ఆ కార్మికులకు తన మద్దతు తెలియజేశారు. తూత్తుకుడి జిల్లా తిరుచెందూరులో ఆదివారం నామ్ తమిళర్ కట్చి నేతృత్వంలో కల్లుగీత కార్మికులకు మద్దతుగా నిరసన కార్యక్రమం జరిగింది. కల్లుగీతకు అనుమతి ఇవ్వాలని, కల్లు విక్రయాలకు అనుమతి ఇవ్వాలని నిరసనకారులు నినాదాలు చేశారు. ఈ సమయంలో సమీపంలోని తాటిచెట్లను చూసిన ఆ పార్టీ కన్వీనర్ సీమాన్ తానూ ఓ కార్మికుడ్ని అని చాటుకునేలా తాటి చెట్టు ఎక్కేశారు. ఆయన చెట్టు ఎక్కేందుకు వీలుగా మెట్ల తరహాలో ఏర్పాట్లు చేశారు. కల్లు విక్రయాలకు అనుమతి ఇవ్వాలని నినాదించారు. ఈ సమయంలో కాసేపు ఉత్కంఠ నెలకొ నడంతో ఆయనకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అక్కడున్న కార్మికులు తక్షణం ఆ చెట్టు మీదకు చేరారు. చెట్టు చుట్టూ రక్షణ కవచంగా నిలబడ్డారు. అయినా సీమాన్ తగ్గలేదు. తాటి చెట్టు మీదున్న కుండలలోని కల్లును కిందకు దించారు. అందరికి స్వయంగా కల్లు పంచి పెట్టి, తాను స్వీకరించారు. కల్లుగీతకు అనుమ తి ఇవ్వాలని నినాదిస్తూ, ఈ పోరాటం మరింత ఉధృతం అవుతుందని హెచ్చరించారు. తాము అధికారంలోకి వస్తే కల్లు, కొబ్బరి, ఈత కల్లు విక్రయాలకుఅనుమతి ఇస్తామని ప్రకటించారు.
దివ్యాంగులకు కృత్రిమ
అవయవాల పంపిణీ
సాక్షి, చైన్నె : చైన్నెలోని చూలైలో ఆదినాథ్ జైన్ ట్రస్ట్ నేతృత్వంలో ఆదివారం 600 మంది దివ్యాంగులకు రూ.30 లక్షలు విలువైన కృత్రిమ అవయవాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి దేవాదాయ శాఖమంత్రి శేఖర్బాబు హాజరై, కృత్రిమ అవయవాలను అర్హులైన వారికి అందజేశారు. ఆదినాథ్ జైన్ ట్రస్టు ఇటీవల కాలంగా పేదలకు సేవలు అందించడమే కాకుండా, దివ్యాంగులకు తమ వంతు తోడ్పాటును అ ందిస్తూ వస్తుంది. తమను ఆశ్రయించిన దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు, మూడు చక్రాల సైకిళ్లు, వీల్ చైర్లు, గాస్లెస్, బధిరులకు హియరింగ్ రింగ్, వాకింగ్ సపోర్టు తదితర ఉపకరణాల పంపినీకి చర్యలు తీసుకుంది. ఈ కార్యక్రమంలో జైన్ ట్రస్ట్ ప్రతినిధులు డాక్టర్ మోహన్జైన్, రుణాలాల్, దేవరా, ప్రకాష్, ధనరాజ్, రాజేష్, మిలాప్ చంద్, జవర్ లాల్జీ, తదితరులు పాల్గొన్నారు.
నీట్లో నైల్లె
విద్యార్థి ప్రతిభ
● సూర్య నారాయణకు రాష్ట్రస్థాయి మొదట ర్యాంకు
తిరువొత్తియూరు: డాక్టరై పేదలకు సేవ చేయడమే తన లక్ష్యమని నీట్ రాష్ట్రస్థాయి ప్రథమర్యాంకు సాధించిన నైల్లె విద్యార్థి సూర్య నారాయణ తెలిపారు. దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థులు రాసిన శ్రీనీట్శ్రీ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఇందులో నైల్లె విద్యార్థి సూర్యనారాయణన్ 720 మార్కులకు 665 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో మొదటి స్థానం, అఖిల భారత స్థాయిలో 27వ స్థానం సాధించాడు. అతను కిండర్ గార్టెన్ నుంచి 12వ తరగతి వరకు పలయంకోట్టైలోని పుష్పలత విద్యా మందిర్ పాఠశాలలో చదువుకున్నాడు. విద్యార్థి సూర్యనారాయణన్ పలయంకోట్టై మహారాజనగర్లో నివసిస్తున్నాడు. అతని తండ్రి శంకరసుబ్రమణియన్ నైల్లె రైల్వేస్టేషన్న్లో టికెట్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడు. తల్లి సుబ్బులక్ష్మి, అన్న ముత్తయ్య శివవేలన్ ఉన్నారు. ఈ విజయం గురించి సూర్య నారాయణన్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు నీట్లో ఎక్కువ స్కోరు సాధించమని తనని ప్రోత్సహించారన్నారు. తన మనస్సులో ఎప్పుడూ చదువు మాత్రమే ఉంటుందన్నారు. నీట్కు సంబంధించి భయం, అలసట అవసరం లేదన్నారు. లక్ష్యంతో చదివితే ఎవరైనా ఉత్తీర్ణులు కావచ్చని చెప్పారు. ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్య కళాశాలలో చదివి న్యూరాలజీ లేదా కార్డియాలజీ రంగంలో వైద్య నిపుణుడిగా ఎదిగి పేదలకు సేవ చేయడమే తన లక్ష్యమని చెప్పారు.

తాటి చెటెక్కిన సీమాన్