తగ్గని రామన్న | - | Sakshi
Sakshi News home page

తగ్గని రామన్న

Jun 16 2025 5:43 AM | Updated on Jun 16 2025 5:43 AM

తగ్గని రామన్న

తగ్గని రామన్న

సాక్షి,చైన్నె : పీఎంకే అధికార సమరంలో రాందాసు ఏ మాత్రం తగ్గడం లేదు. అన్బుమణికి మద్దతుగా వ్యవహరించిన పార్టీ ప్రధాన కార్యదర్శి వడివేల్‌ రావణన్‌ను తొలగించారు. ఆయన స్థానంలో యువకుడైన మురళీశంకర్‌ను నియమించారు. పీఎంకేలో రాందాసు, అన్బుమణి మధ్య సాగుతున్న సమరం గురించి తెలిసిందే. వీరి మధ్య వివాదం ముదిరి పాకాన పడింది. శుక్ర, శనివారాల్లో చోటు చేసుకున్న పరిణామాలతో అన్బుమణి దూకుడు పెంచినా, రాందాసు ఏ మాత్రం తగ్గడం లేదు. అన్బుమణికి మద్దతుగా వ్యవహరిస్తూ వచ్చిన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వడివేల్‌ రావణన్‌ను తొలగించారు. ఇది పార్టీ వర్గాలకు పెద్ద షాక్‌గా మారింది. అదే సమయంలో అన్బుమణి సైతం వెనక్కు తగ్గే పరిస్థితి నెలకొంది. తిరువళ్లూర్‌లో నెలకొన్న కార్యక్రమంలో తన తండ్రి, పార్టీ వ్యవస్థాపకుడికి అనుకూలంగా అన్బుమణి వ్యాఖ్యలు చేసినా రాందాసు ఏ మాత్రం తగ్గడం లేదు. తానే పార్టీకి సర్వం అని చాటే దిశగా మరింత దూకుడు ప్రదర్శించే పనిలో పడ్డారు. వడివేల్‌ రావణన్‌ను తొలగించిన ఆయన ఆ పదవికి యువకుడైన మురళీ శంకర్‌ను నియమించారు. తనను ప్రధాన కార్యదర్శిగా నియమించడంతో మురళీశంకర్‌, రాందాసును కలిసి ఆశీస్సులు అందుకున్నారు. తన నియామక ఉత్తర్వులను తైలాపురం గెస్ట్‌ హౌస్‌కు వెళ్లి మరీ అందుకున్నారు. రాందాసు మరింత దూకుడుగా ముందుకు సాగుతుండడంతో వన్నియర్‌ సంఘం నేతలు సైతం తైలాపురం వైపుగా క్యూకట్టే పనిలో పడ్డారు. వన్నియర్‌ సంఘంలో ఎలాంటి వివాదాలు లేవని, పార్టీలోనే ఉందని, దీనికి ఏదో ఒక రోజు ముగింపు అన్నది వస్తుందని వన్నియర్‌ సంఘాల నేతలు స్పష్టం చేశారు. ఇది వరకు పార్టీ కోశాధికారి తిలకబామా, ఆ తదుపరి అనేక జిల్లాల నేతలు, నిన్న వన్నియర్‌ సంఘం నేత బాలు, తాజాగా వడివేల్‌ రావణన్‌ను తొలగించిన రాందాసు , ఇక మున్ముందు ఎవరెవర్ని పార్టీ నుంచి సాగనంపనున్నారో? అన్న ఉత్కంఠ పీఎంకేలో నెలకొంది.

ప్రధాన కార్యదర్శి రావణన్‌కు ఉద్వాసన

కొత్త కార్యదర్శిగా మురళీశంకర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement