
టికెట్ డబ్బు వృథా కాదు
తమిళసినిమా: నటుడు, నిర్మాత అరుణ్ పాండ్యన్ తాజాగా తన ఏఎన్పీ గ్రూప్స్ పతాకంపై నిర్మించి ప్రధాన పాత్ర పోషించిన చిత్రం అక్కేనం. ఆయన వారసురాలు నటి కీర్తి పాండియన్ కథానాయకి నటించిన ఈ చిత్రానికి కే ఉదయ్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. ఇంతకుముందు షార్ట్ ఫిలిమ్స్ రూపొందించిన ఈయన దర్శకత్వ వహించిన తొలి చిత్రం ఇదే అన్నది గమనార్హం. కాగా నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకున్న అక్కేనం చిత్రం జూలై 4వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్రం యూనిట్ శనివారం మధ్యాహ్నం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. నటి కీర్తి పాండియన్ మాట్లాడుతూ చిత్రం కథను చెప్పే ముందు దర్శకుడు ఉదయ్ తాను తెరకెక్కించిన యాకై ్క త్రీ అరే షార్ట్ ఫిలింలో చూపించారన్నారు. అది తనకు ఎంతో నచ్చిందన్నారు. ముఖ్యంగా ఆయన రూపొందించిన విధానం, క్వాలిటీ, టెక్నికల్ అంశాలు ఇంప్రెస్ చేశాయన్నారు. అలాగే అక్కేనం చిత్రాన్ని తన టీమ్తోనే పని చేస్తానని చెప్పారన్నారు. కొత్త వారిలో ఫ్యాషన్, ఫైర్, కాన్ఫిడెంట్ ఉంటుందన్నారు. అందుకే తాను ఉదయ్ దర్శకత్వంలో చిత్రం చేయడానికి సిద్ధమైనట్లు చెప్పారు. అలాగే అంతకుమించిన ఫ్యాషన్, కాన్ఫిడెంట్ తన తండ్రి అరుణ్ పాండియన్లో చూశానన్నారు. నాన్న ఇనైంద కై గళ్, ఊమై విళిగళ్ చిత్రాల్లో నటించినప్పుడు తాను పుట్టలేదని, అయితే ఫిలిం ఇన్స్టిట్యూట్ విద్యార్థులైన ఆ గ్యాంగ్ ఆఫ్ బాయ్స్ ఎలా చేశారన్నది ఈ చిత్రంలో నాన్న పనిని చూసి ఊహించుకున్నానన్నారు. ప్రస్తుతం సమాజంలో ఏవేవో ఉపద్రవాలు జరుగుతున్నాన్నారు. అయితే ఒక కళాకారునిగా తాను సినిమా ద్వారా ఒక మంచి విషయాన్ని ప్రేక్షకులకు చెప్పాలని చూస్తానన్నారు. అలాంటి చిత్రమే ఈ అక్కేనం అని కీర్తి పాండియన్ పేర్కొన్నారు. నటుడు నిర్మాత అరుణ్ పాండ్యన్ మాట్లాడుతూ తాము ఒక మంచి చిత్రాన్ని చేసామన్న సంతృప్తి కలిగిందని, ఇది ప్రేక్షకులు కొన్న టికెట్ డబ్బు వృథా కాదన్నారు.

టికెట్ డబ్బు వృథా కాదు