రాబోయే
● వడగాలులు వీచే అవకాశం ఉంది
● ఇన్చార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్
శ్రీకాకుళం పాతబస్టాండ్: రాబో యే ఐదు రోజులు జిల్లా వాసు లు జాగ్రత్తగా ఉండాలని ఇన్చార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ బుధవారం కోరారు. జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో బుధవారం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. జిల్లాలో బూ ర్జ, హిరమండలం, ఎల్ ఎన్ పేట, పాతపట్నం, సారవకోట మండలాల్లో తీవ్ర వడగాలులు, ఆమదాలవలస, జి.సిగడాం, జలుమూరు, కొత్తూరు, సరుబుజ్జిలి మండలాల్లో వడగాలులు ఉండే అవకాశం ఉందన్నారు. 22వ తేదీన హిరమండలం, పాతపట్నం మండలాల్లో వడగాలు లు ఉంటాయన్నారు. డ్వామా పీడీ లవరాజు మాట్లాడుతూ ఉపాధి వేతన దారులు ఉదయం 5.30 నుంచి 9.30 గంటల వరకు, సాయంత్రం ఎండ తగ్గాక పనులు చేయాలన్నారు.
5


