అండర్–19 రాష్ట్ర క్రికెట్ జట్టుకు చర్విశ్రీ ఎంపిక
శ్రీకాకుళం: అరసవిల్లి రోడ్డులోని శర్వాణి విద్యాల యలో 9వ తరగతి చదువుతున్న తమ్మిరాజు చర్వి శ్రీ అండర్–19 క్రికెట్ రాష్ట్ర జట్టుకు శ్రీకాకుళం జిల్లా తరఫున ఎంపికై ంది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి టోర్నమెంట్కు జరిగిన ఈ ఎంపికల్లో జిల్లా నుంచి ఎంపికై న ఏకై క క్రీడాకారిణిగా నిలిచింది. విశాఖ, విజయనగరం జిల్లాల్లో నిర్వహించిన ఎంపిక మ్యాచుల్లో బౌలింగ్, బ్యాటింగ్లో మెరుగైన ప్రతిభ కనబరిచింది. త్వరలో జరగనున్న జాతీయ స్థాయి టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున ఆడనుంది. ఈ సందర్భంగా శర్వాణి విద్యా సంస్థల వ్యవస్థాపకులు అంధవరపు సూరిబాబు విద్యార్థిని శనివారం అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఆంజనేయులు, హెచ్ఎం కె.రేఖ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


