●లక్ష్మీనారసింహా.. నమోనమః
మడకశిరరూరల్: లక్ష్మీనారసింహ గోవిందా.. గోవింద అంటూ భక్తుల నామస్మరణతో ఆలయ పరిసరాలు ప్రతిధ్వనించాయి. భక్తరపల్లి లక్ష్మీనరసింహస్వామి, జిల్లెడుగుంట ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ధ్వజారోహణ, అంకురార్పణ చేశారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివార్లను దర్శించుకుని తరించారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బెంగళూరుకు చెందిన హనుమంతయ్య, రామాంజనప్ప వారి కుటుంబ సభ్యులచే, ఆంజినేయస్వామి ఆలయంలో గోవిందరాజులు, రత్నమ్మ కుటుంబ సభ్యులచే ధ్వజారోహణ, అంకురార్పణ, అగ్నిహోత్ర, హోమం తదితర కార్యక్రమాలను పురోహితులు నిర్వహించారు. స్వామివార్లకు ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే ఎంఎస్ రాజు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించి, పూజలు చేశారు. అదే విధంగా రొళ్ల జెడ్పీటీసీ అనంతరాజు కుటుంబ సభ్యులు స్వామి వార్లకు పూజలు చేసి, మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, సర్పంచులు కరియన్న, రామాంజినేయులు, ఈఓ నరసింహరాజు, కమిటీ చైర్మన్ నర్సేగౌడ్, సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
నేడు హనుమద్ వ్రతం..
బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆలయాల్లో స్వామి వార్లకు మన్యసూక్త పవమాన హోమం, హనుమద్వ్రతం, అభిషేకం తదితర పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు దేవదాయ శాఖ అధికారులు తెలిపారు.
భక్తరపల్లి, జిల్లెడుగుంట
బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
తరలివచ్చిన భక్తులు
నేడు హనుమద్వ్రతం
●లక్ష్మీనారసింహా.. నమోనమః
●లక్ష్మీనారసింహా.. నమోనమః


