దంపతుల ఆత్మహత్య | Couple Commit Suicide In Anantapur District - Sakshi
Sakshi News home page

దంపతుల ఆత్మహత్య

Oct 7 2023 12:30 AM | Updated on Oct 7 2023 6:46 PM

- - Sakshi

పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పి రొప్పం గ్రామంలో దంపతులు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

అనంతపురం: పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పి రొప్పం గ్రామంలో దంపతులు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల వివరాలమేరకు... రొప్పం గ్రామానికి చెందిన దంపతులు మను (26), పవిత్ర (22) బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి రెండేళ్ల కుమార్తె ఉంది. కళ్యాణదుర్గం తాలూకా కంబదూరు మండలం ఒంటారెడ్డిపల్లికి చెందిన మను తాలూకాలోని పాలకుంట గ్రామానికి చెందిన పవిత్రను మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు.

వీరు చాలా ఏళ్ల క్రితం వలస వచ్చి రొప్పం గ్రామంలో స్థిర పడ్డారు. అయితే టమాట పంటలో నష్టం రావడంతో తీర్చేమార్గం లేక బెంగతో గురువారం రాత్రి మను, పవిత్ర ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానిక సమాచారంతో సీఐ సురేష్‌, ఎస్‌ఐ గురునాథ్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement