ప్రజలకు ఇచ్చిన మాట ను కరోనా సమయంలోనూ అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి తప్పలేదని.. సంక్షేమ కార్యక్రమాలను సజావుగా అమలు చేశారని మాజీ ఎమ్మెల్యే, ఆత్మకూరు ఇన్చార్జి మేకపాటి విక్రమ్రెడ్డి పేర్కొన్నారు. హామీలను ప్రస్తుత ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆరోపించారు. జగన్మోహన్రెడ్డిపై బురద జల్లాలనే ఉద్దేశంతో దేవుడ్ని సైతం వదల్లేదంటే టీడీపీ బుద్ధి ఏమిటో అర్థమవుతోందన్నారు. మన సత్తాకు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే నిదర్శనం కావాలని పిలుపునిచ్చారు. అప్పులు తెస్తూ.. ఆ మొత్తాన్ని అమరావతికే తగలేస్తున్నారని ఆరోపించారు. ఓటుకు నోటును పంచడాన్నే నేర్పిన చంద్రబాబు ఇప్పుడు నీతులు చెప్తున్నారని విమర్శించారు.


