– రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేక, ప్రజావ్యతిరేకతను తట్టుకోలేక చంద్రబాబు, లోకేశ్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. రెండేళ్లుగా కూటమి చేసిన మోసాలు, వెన్నుపోట్లను, డీఎస్సీ అక్రమాలను, అమరావతి భూ కుంభకోణాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు, దాడులతో భయభ్రాంతులకు గురి చేయాలని, ప్రశ్నించిన గొంతులను నొక్కాలని చూస్తున్నారు. డీఎస్సీ స్కామ్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చారిత్రాత్మకం. విద్యా శాఖ మంత్రిగా లోకేశ్ అసమర్థుడు. నీతి నిజాయితీ ఉంటే తన శాఖలో జరిగిన కుంభకోణానికి బాధ్యత వహించి రాజీనామా చేయాలి.


