– తూమాటి మాధవరావు, ఎమ్మెల్సీ
కూటమి ప్రభుత్వం అసమర్థ పాలనను, అవినీతి, అక్రమాలు ప్రశ్నించిన వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది. డీఎస్సీ అక్రమాలను నిగ్గదీసి ప్రశ్నించినందుకే ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి విద్యా సంస్థల్లో రాజకీయ కక్ష పూరితంగా తనిఖీలు చేశారు. చంద్రశేఖరరెడ్డి నిర్వహిస్తున్న విద్యా సంస్థల్లో ఎంతో మంది పేదలకు ఉచితంగా విద్యను అందిస్తున్నారు. నారాయణ విద్యాసంస్థల్లో ఒక్కరికై నా ఉచితంగా చదువు చెప్పారా? కందుకూరు నియోజక వర్గంలోఒక మహిళ నుంచి రూ.15 లక్షలు తీసుకుని డీఎస్సీలో ఉద్యోగం ఇచ్చారు. నా వద్ద బ్యాంకు స్టేట్మెంట్లు కూడా ఉన్నాయి. డీఎస్సీలో అడ్డగోలుగా ఉద్యోగాలు అమ్ముకున్నారు. కూటమి ప్రభుత్వ అక్రమాలను ఎండగడతాం.


