పుష్పాలంకరణలో రంగడి దర్శనం
నెల్లూరు(బృందావనం): నెల్లూరు నగరంలోని రంగనాయకులపేటలోని శ్రీదేవి, భూదేవి సమేత తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానంలో అధ్యయనోత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పగల్పత్తు ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజైన గురువారం రంగనాథ స్వామి విశేష పుష్పాలంకరణలో దర్శనమిచ్చారు. ఉభయదేవేరులతో కొలువైన స్వామివారిని భక్తులు దర్శించుకుని తీర్థ, ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా డాక్టర్ ఎం.ప్రసన్నగుప్తా, దుర్గావరం వ్యవహరించారు. ఈ కార్యక్రమాలను దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆళ్ల శ్రీనివాసరెడ్డి పర్యవేక్షించారు.


